News February 23, 2025
యాదాద్రిలో CM టూర్.. వాహనాలకు నో ఎంట్రీ

సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో యాదాద్రి కొండపైకి వాహనాలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. కొండ కింద పోలీసులు సూచించిన పార్కింగ్ స్థలంలోనే వాహనాలను నిలిపి ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి వెళ్లాలని సూచించారు. కొండపైకి నిత్యం 25 బస్సులు నడుస్తాయాన్నారు.
Similar News
News February 23, 2025
కుల్దీప్ 300.. హార్దిక్ 200

టీమ్ ఇండియా ప్లేయర్లు కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య అంతర్జాతీయ క్రికెట్లో కొత్త మైలురాయిని చేరుకున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి కుల్దీప్ 300, పాండ్య 200 వికెట్లు తీశారు. కుల్దీప్ వన్డేల్లో 176, టీ20ల్లో 69, టెస్టుల్లో 56 వికెట్లు తీయగా పాండ్య టీ20ల్లో 94, వన్డేల్లో 89, టెస్టుల్లో 17 వికెట్లు తీశారు. ప్రస్తుతం టీ20ల్లో ఆల్రౌండర్ల జాబితాలో పాండ్య నం.1 ర్యాంకులో కొనసాగుతున్నారు.
News February 23, 2025
నెల్లూరు: ప్రశాంతంగా ముగిసిన CM పర్యటన

నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర కుమారుడి వివాహం జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సందర్భంగా నెల్లూరులో జిల్లా ఎస్పీ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం పర్యటనను విజయవంతం చేశారు. దీంతో అందరికీ జిల్లా ఎస్పీ దన్యవాదాలు తెలియజేశారు.
News February 23, 2025
నర్సీపట్నం: బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీసు అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల ఏర్పాటుపై ఆదివారం శాసనసభ ప్రాంగణంలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న క్యాంటీన్ పనులను పరిశీలించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.