News May 29, 2024
యానాం: గేదెను ఢీకొట్టి యువకుడి మృత్యువాత
యానాం ఒబిలిస్క్ టవర్ వద్ద మంగళవారం బైకుపై వేగంగా వెళుతున్న యువకుడు కర్రి నూకరాజు(21) గేదెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. గుడికి వెళ్లడం కోసం ఆటోలో బయల్దేరిన నూకరాజు కుటుంబం రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న తమ కుమారుడిని చూసి యానాం ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా వైద్యులు వెంటనే కాకినాడకు తరలించారు. చికిత్సపొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News October 9, 2024
పిఠాపురం అత్యాచార ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు
పిఠాపురం మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. కిడ్నాప్ సహ ఆరు సెక్షన్ల కింద పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత బాలిక మేనత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై విపక్ష నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
News October 9, 2024
తూ.గో జిల్లాలో TODAY TOP NEWS
➣ తూ.గో. పుష్కరాలకు రూ.100 కోట్ల నిధులు కేటాయింపు
➣ ఎమ్మెల్యేలు దోచుకునేందుకే కొత్త మద్యం పాలసీ: భరత్
➣ తూ.గో: నేటి నుంచి ప్రత్యేక రైళ్లు..
➣ పిఠాపురంలో మద్యం తాగించి బాలికపై అత్యాచారం
➣ చేనేత పరిశ్రమ అభివృద్ధిపై సీఎంతో చర్చించిన ఎంపీ తంగేళ్ల
➣ పిఠాపురం బాలిక అత్యాచార నిందితుడిపై పోక్సో కేసు
News October 8, 2024
తూ.గో.జిల్లాకు రూ.100 కోట్ల నిధులు కేటాయింపు
2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్ట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ.100 కోట్ల నిధులను కేటాయించిందని టూరిజం అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాట్లకు, రాజమండ్రి నగరాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ దిశగా సంబంధిత అధికారులు పనులు ప్రారంభించారు.