News March 19, 2025

రక్తదానం చేసిన హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య

image

తలసేమియా వ్యాధిగ్రస్తులకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో సుబేదారిలోని రెడ్ క్రాస్ రక్తనిధిలో రక్తదాన కార్యక్రమాన్ని హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. ఈ శిబిరం యువతలో స్ఫూర్తి కలిగించేందుకు హన్మకొండ కలెక్టర్ స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం రక్త దానం చేసిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, పండ్లను అందజేశారు.

Similar News

News March 19, 2025

సన్న వడ్లకు రూ.500 బోనస్‌‌పై UPDATE

image

TG: సన్న రకం వడ్లకు రూ.500 బోనస్‌పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. వానకాలం పంటకు సంబంధించి రూ.1200 కోట్ల నిధులకు ఆర్థిక శాఖ నిన్న ఆమోదం తెలిపిందని ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు.

News March 19, 2025

పెద్దేముల్ మండలంలో తెల్లవారుజామున హత్య

image

పెద్దేముల్ మండలంలోని హన్మాపూర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున హత్య జరిగింది. గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హన్మాపూర్ వరుస హత్యలు కలవర పెడుతున్నాయి.

News March 19, 2025

హిందూపురం వ్యక్తి దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లా మలుగూరు సమీపంలో హిందూపురానికి చెందిన సద్దాం(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగగా.. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హిందూపురం రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!