News March 31, 2025

రణస్థలం: అనుమానాస్పద స్థితిలో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

image

రణస్థలంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్న పిన్నింటి అప్పలసూరి ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పరిశ్రమలో ఉన్న వాష్ రూమ్‌లో ఉరివేసుకొని మృతి చెందినట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. మృతునిది నరసన్నపేట మండలం లుకలాం గ్రామం అని తెలిసింది. అయితే అప్పలసూరి మృతి పట్ల బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

Similar News

News April 5, 2025

వజ్రపుకొత్తూరు: బాతుపురంలో నెమళ్ల సందడి

image

వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలో శుక్రవారం నెమళ్లు సందడి చేశాయి. గ్రామం సమీపంలోని కొండల ప్రాంతం నుంచి నెమళ్లు గ్రామానికి చేరుకుని గ్రామంలోని చెట్లపై కనిపిస్తూ కనువిందు చేశాయి. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన నెమళ్లు జనావాసాల్లోకి వస్తుండటంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా నెమళ్లు రాక గ్రామస్థులకు ఆహ్లాదాన్ని ఇచ్చింది.

News April 5, 2025

SKLM: అలెర్ట్.. రైళ్ల గమ్య స్థానాల్లో మార్పులు

image

పలాస, శ్రీకాకుళం మీదుగా ప్రయాణించే షాలిమార్- వాస్కోడగామా(VSG) అమరావతి ఎక్స్‌ప్రెస్ రైళ్ల గమ్యస్థానంల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున ఈనెల 17- 28 వరకు నం.18047 SHM- VSG రైలు వాస్కోడగామాకు బదులుగా హుబ్లీ వరకు వెళ్లనుంది. ఈ నెల 20 నుంచి మే 1 వరకు నెం.18048 VSG- SHM రైలు వాస్కోడగామాకు బదులుగా హుబ్లీ నుంచి నడుస్తాయన్నారు.

News April 5, 2025

SKLM: మెగా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

image

మెగా డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ, ఈడబ్ల్యూఎస్ (ఈబీసీ) అభ్యర్థులకు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ శ్రీకాకుళం ఉచిత ఆన్‌లైన్ శిక్షణను అందించనున్నట్లు సంస్థ సంచాలకులు ఈ.అనురాధ తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

error: Content is protected !!