News April 24, 2025
రాంబిల్లి: తండ్రిని హత్య చేయించిన కొడుకు

రాంబిల్లి మండలం చినకలువలాపల్లిలో ఈ నెల 21న వడ్డీ వ్యాపారి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. జల్లి తాతారావును కొడుకు అప్పల రెడ్డే హత్య చేయించాడని సీఐ నరసింగరావు బుధవారం తెలిపారు. తండ్రి తన ఆస్తిని సవతి తల్లి కుమార్తెకు ఇచ్చేస్తాడని అనుమానించి ఇద్దరు వ్యక్తులను పురమాయించి హత్య చేయించినట్లు తెలిపారు. అప్పల రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
Similar News
News April 24, 2025
NZB: భూ సమస్యల పరిష్కారానికి నూతన చట్టం: కలెక్టర్

భూభారతి చట్టం ద్వారా రైతుల, ప్రజల సమస్యలు తీరుతాయని కలెక్టర్ తెలిపారు. రైతులకు, ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, చట్టంలో పొందుపర్చిన కీలక అంశాల గురించి భీంగల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ధరణి రికార్డులను భూభారతిలో నమోదు చేస్తామని వెల్లడించారు. ఎవరికైనా భూముల రికార్డుల విషయంలో తప్పులు ఉంటే, ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలంలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 24, 2025
శంకరపట్నం: భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టంపై అవగాహన

శంకరపట్నం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తి హాజరై మాట్లాడుతూ.. ఈ కొత్త చట్టం ద్వారా భూ హక్కులపై కొన్ని కొత్త సవరణలు, విచారణ అధికారం కల్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఎమ్మార్వో భాస్కర్, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News April 24, 2025
గేమ్ ఛేంజర్ అందుకే ఫ్లాప్ అయింది: కార్తీక్ సుబ్బరాజ్

ఎన్నో అంచనాలతో తెరకెక్కిన రామ్ చరణ్ ’గేమ్ ఛేంజర్’ సినిమా డిజాస్టర్గా నిలిచింది. అందుకు గల కారణాన్ని తమిళ డైరెక్టర్, ఆ మూవీ కథ రైటర్ కార్తీక్ సుబ్బరాజ్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘ఓ ఐఏఎస్ ఆఫీసర్ కథను శంకర్కు చెప్పాను. కానీ తర్వాత స్టోరీని పూర్తిగా వేరేలా మార్చారు. కొత్త రైటర్లు చాలామందిని తీసుకున్నారు. కథ, స్క్రీన్ప్లే సమూలంగా కొత్త సినిమాను తలపించాయి’ అని పేర్కొన్నారు.