News March 20, 2025

రాజకీయ నాయకులతో మహబూబాబాద్ కలెక్టర్ సమీక్ష

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. ఓట్ల నమోదు ప్రక్రియ గురించి రాజకీయ పార్టీల నాయకుల నుండి సలహాలు సూచనలు తీసుకున్నారు. అనంతరం వాడితో మాట్లాడుతూ.. పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీ నాయకులు విజయ సారధి రెడ్డి, మార్నేని వెంకన్న, సురేశ్ పెరుగు కుమార్, శివరాజ్ పాల్గొన్నారు.

Similar News

News March 28, 2025

రోడ్లపై నమాజ్ చేస్తే పాస్‌పోర్ట్, లైసెన్స్ రద్దు: UP పోలీసులు

image

యూపీలో ముస్లింలకు అక్కడి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై నమాజ్ చేయొద్దని తేల్చిచెప్పారు. అలాంటి పనులకు ఎవరైనా పాల్పడితే వారి పాస్‌పోర్టును, డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ‘ఈద్ ప్రార్థనల్ని మసీదులు లేదా ఈద్గాల్లోనే చేయాలి. రోడ్లపై చేసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

News March 28, 2025

NGKL: ఉప్పునుంతలలో 40.0 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా.. అత్యధికంగా ఉప్పునుంతలలో 40.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లి, వంగూర్, నాగర్ కర్నూల్ 39.9, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి 39.8, కోడేరు 39.7, బిజినపల్లి, చారకొండ 39.6, కొల్లాపూర్, కల్వకుర్తి 39.3, వెల్దండ 39.1, అచ్చంపేట 39.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 28, 2025

చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్‌కు సాహిత్య అకాడమీ అవార్డు

image

చేవెళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ దాసరి వెంకటరమణకు అరుదైన గౌరవం దక్కింది. 2014లో ఆయన రాసిన ఆనందం అనే కథల సంపుటిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఇదే కథల సంపుటిని షోలాపూర్‌కు చెందిన బుధవారం రేణుక ‘ఆనందం’ పేరుతో మరాఠీలోకి అనువాదం చేశారు. కథల సంపుటిలోని ఆనంద అనే మొదటి కథను మహారాష్ట్రలోని షోలాపూర్‌ విశ్వవిద్యాలయంలో బీఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఈ ఏడాది ఎంపిక చేశారు.

error: Content is protected !!