News February 6, 2025
రాజన్న సిరిసిల్ల: మహిళ ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తి అరెస్ట్..
స్నానం చేస్తుండగా మహిళ ఫొటోలు, వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కోనరావుపేట ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య ఓ మహిళ స్నానం చేస్తుండగా తన సెల్ ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీశాడని బాధిత మహిళ పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 6, 2025
పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల
TG: పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 1న రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. మరోవైపు మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. MAR 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. జూన్ 11-14 వరకు పరీక్షలు నిర్వహించనుంది.
News February 6, 2025
సైఫ్ అలీఖాన్ కేసులో కీలక పరిణామం
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కేసులో కీలక పురోగతి లభించింది. దాడి చేసిన నిందితుడిని సైఫ్ సిబ్బంది గుర్తించారు. పోలీసులు నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్లో నిందితుడిని వారు స్పష్టంగా గుర్తించి చూపించారు. సైఫ్పై దాడి చేసింది అతడేనని పోలీసులకు తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బంగ్లాదేశ్కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
News February 6, 2025
రాజమండ్రి: పవన్ కల్యాణ్ కోసం జన సైనికుల పూజలు
అస్వస్థతకు గురైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కల్యాణ్కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షిస్తూ గురువారం జనసేన నాయకులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి దేవీచౌక్లోని శ్రీ బాలాత్రిపుర సుందరిదేవి, శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు, ప్రార్థనలు చేశారు. జనసేన నాయకులు సూర్య బయ్యపునీడి, విక్టరీ వాసు, చక్రపాణి, విన్నా వాసు తదితరులు పాల్గొన్నారు.