News March 10, 2025
రాజన్న సిరిసిల్లకు మొండిచేయి..!

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు మంజూరు చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా పాఠశాలలు నిర్మిస్తున్నామన్నారు. మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్ కు రూ. 200 కోట్లు కేటాయించారు.. కాగా సిరిసిల్ల జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం నిధులు కేటాయించలేదు.
Similar News
News March 10, 2025
కలెక్టర్ క్రాంతిని కలిసిన ఎస్పీ

సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని ఎస్పీ కలిశారు. ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకై కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
News March 10, 2025
నిజామాబాదులో ప్రజావాణికి 95 ఫిర్యాదులు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీఓ శ్రీనివాస్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు.
News March 10, 2025
విజయవాడ: వల్లభనేని వంశీ కేసులో అప్డేట్

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు సత్యవర్ధన్ న్యాయవాది సమయం కోరారు. విచారణ అనంతరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. అలాగే వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ కూడా వాయిదా పడింది. వంశీ భద్రత రీత్యా బ్యారక్ మార్చలేమని అధికారులు న్యాయమూర్తికి వివరించారు.