News April 23, 2025

రాజమండ్రి: స్పా ముసుగులో వ్యభిచారం

image

రాజమండ్రిలో స్పాముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పా‌ సెంటర్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. SI ఆదినారాయణ వివరాల ప్రకారం.. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని చెప్పి యువతులకు ఎరవేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. SIకు వచ్చిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఐదుగురు యువతులు, ఐదుగురు విటులు పట్టుబడ్డారు. స్పా నిర్వాహకుడు మదన్, మేనేజర్ తేజశ్రీని అరెస్టు చేసి కేసు దార్యప్తు చేస్తున్నారు.

Similar News

News April 23, 2025

10th RESULTS: 6వ స్థానంలో తూర్పు గోదావరి

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 23,388 మంది పరీక్ష రాయగా 20,578 మంది పాసయ్యారు. 11,975 మంది బాలురులో 10,310 మంది, 11,413 మంది బాలికలు పరీక్ష రాయగా 10,268 మంది పాసయ్యారు. 87.99% పాస్ పర్సంటైల్‌తో తూర్పు గోదావరి 6వ స్థానంలో నిలిచింది.

News April 22, 2025

తాళ్లపూడి: పుష్కరాల రేవులో శిశువు మృతదేహం లభ్యం

image

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి పుష్కరాల స్నాన ఘట్టానికి వెళ్లే మార్గంలో ఆడ శిశువు మృతదేహాన్ని మంగళవారం స్థానికులు కనుగొన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొవ్వూరు సీఐ విజయబాబు ప్రాంతాన్ని సందర్శించి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆడ శిశువు మృతదేహం లభ్యమవ్వడంతో చుట్టుపక్కల ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులలో పోలీసులు విచారణ చేపట్టారు.

News April 22, 2025

కొవ్వూరు: ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య

image

కొవ్వూరు మండలంలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణానికి చెందిన వాలిశెట్టి రాంబాబు(54) ఉరివేసుకున్నారు. దొమ్మేరుకి చెందిన వరలక్ష్మి ఈనెల 20న 40మాత్రలు మింగిడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదులతో రెండు ఘటనలపై పట్టణ పోలీసులు విడివిడిగా కేసులు నమోదు చేశారు.

error: Content is protected !!