News February 23, 2025
రాజలింగమూర్తి హత్య ఘటనలో ఏడుగురు అరెస్ట్

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నాగవెల్లి రాజలింగమూర్తి హత్య ఘటనలో 10 మందిపై కేసు నమోదు చేసి, ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారిలో బీఆర్ఎస్ ముఖ్యనేత కొత్త హరిబాబు ఉన్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Similar News
News February 23, 2025
అధ్యక్ష పదవిని వదులుకోవడానికి సిద్ధం: జెలెన్స్కీ

ఉక్రెయిన్లో శాంతి నెలకొనడం కోసం అధ్యక్ష పదవిని వదులుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. శాంతి నెలకొల్పినా లేదా నాటో స్యభ్యత్వం ఇచ్చినా ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దేశ భద్రతే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. పదేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగాలనేది తన కల కాదని పేర్కొన్నారు. తమ దేశానికి US భద్రతా హామీలు ఇవ్వాలని కోరారు.
News February 23, 2025
నెల్లూరు నుంచి గ్రూప్-2కు తక్కువగా హాజరైన అభ్యర్ధులు.!

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు 13 జిల్లాల్లో 92 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే అత్యధికంగా విశాఖ జిల్లా వారు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా నుంచి అత్యల్పంగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో 3546 మంది పరీక్షలకు హాజరై 86.4గా నమోదైన సంగతి తెలిసిందే. పరీక్షలు జరుగుతాయా.. లేదా అన్న మీమాంస కూడా పరీక్షకు రాకపోవడానికి ఓ కారణమని కొందరు భావిస్తున్నారు.
News February 23, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు ➤ ఆదోనిలో ఘోరం.. బాలుడిపైకి దూసుకెళ్లిన లారీ ➤ మంత్రాలయం శ్రీ మఠంలో ఆకట్టుకున్న భరతనాట్యం ➤ ఎమ్మిగనూరు ఎస్ఎంఎల్ కాలేజీలో 25న జాబ్ మేళా ➤ జిల్లాలో చికెన్కు తగ్గిన డిమాండ్ ➤ రూ.1.15 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం ➤ జిల్లాలోని ఆలయాల్లో మొదలైన మహా శివరాత్రి సందడి