News February 17, 2025

రాజానగరం: రోడ్డు ప్రమాదంలో తోడికోడళ్లు మృతి

image

రాజానగరం జాతీయ రహదారిపై దివాన్ చెరువు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానవరానికి చెందిన ఇద్దరు తోడి కోడళ్లు మృతి చెందారు. గ్రామస్థుల వివరాల మేరకు.. మహిళలు రిప్కో, చంద్రమ్మ నాగేశ్వరరావుతో కలిసి పాలచర్లలో కూలి పనికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో బైక్ పై వస్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావుని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 12, 2025

రాజమండ్రి: ఆ రైళ్లు సికింద్రాబాద్ వెళ్లవు..!

image

సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు ముమ్మరం కావడంతో స్టేషన్‌కు వచ్చే 14 ముఖ్యమైన రైళ్ల రూటును మార్చేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. లింగంపల్లి- కాకినాడ స్పెషల్ (07445/07446) ఏప్రిల్ 2 నుంచి, లింగంపల్లి- విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805/12806) ఏప్రిల్ 25 నుంచి సికింద్రబాద్‌కు రాకుండానే చల్లపల్లి మీదుగా నడుస్తాయని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.

News March 12, 2025

తూ.గో. జిల్లాకు ప్రత్యేక అధికారి

image

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్‌ IAS అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా ప్రవీణ్ కుమార్‌ను తూ.గో.జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ప్రభుత్వం కేటాయించింది. జోనల్ ఇన్‌ఛార్జ్‌గా అజయ్ జైన్‌ను నియమించింది. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 12, 2025

రాజమండ్రి: జైలులో సరెండర్ కాని బోరుగడ్డ అనిల్

image

వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు హాజరుకాకుండా గైర్హాజరయ్యారు. ఈ మేరకు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తల్లిని చూసేందుకు కోర్టు ఇచ్చిన బెయిల్ గడువు నిన్న సాయంత్రం 5గంటలతో ముగిసింది. మరో గ్రేస్ పీరియడ్‌తో జైలు అధికారులు ఎదురుచూసినా అనిల్ రాకపోవడం గమనార్హం. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

error: Content is protected !!