News March 10, 2025
రాయచోటి: కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రాయచోటి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాగలరని తెలిపారు.
Similar News
News March 10, 2025
అయ్యర్లో పెరిగిన కసి.. వరుస ట్రోఫీలతో సత్తా

BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించిన తర్వాత శ్రేయస్ అయ్యర్లో కసి పెరిగింది. కెప్టెన్గా IPL-2024, రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలతో పాటు ఇరానీ కప్ గెలిపించారు. CTలో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసి జట్టుకు వెన్నెముకగా నిలిచారు. ఇటీవల జరిగిన ఇంగ్లండ్ సిరీస్లో కోహ్లీకి గాయమవడంతో జట్టులోకి వచ్చిన అయ్యర్ కీలక సభ్యుడిగా మారారు. దీంతో శ్రేయస్కు BCCI మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
News March 10, 2025
శ్రీకాళహస్తిలో ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుక?

హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక శ్రీకాళహస్తిలో జరగనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఈ విషయాన్ని త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్తో పాటు స్టార్ నటులందరినీ ఈ వేడుకకు తీసుకొచ్చేందుకు విష్ణు ప్రయత్నిస్తున్నారట. ఈ చిత్రంలో కన్నప్పగా మంచు విష్ణు నటిస్తుండగా.. నందీశ్వరుడిగా ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే.
News March 10, 2025
పార్వతీపురం: 372 మంది విద్యార్థులు గైర్హాజరు

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 372 గైర్హాజరు అయినట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా సోమవారం 34 పరీక్ష కేంద్రాల్లో 7,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 7,508 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 4,954 మంది జనరల్ విద్యార్థులకు గాను 4,812 మంది విద్యార్థులు హాజరుయ్యారు. 2,926 ఒకేషనల్ విద్యార్థులకు గాను 2,696 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.