News March 16, 2025

రాయచోటి: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 17న సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో తెలిపారు. రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రానికి రావాలన్నారు.

Similar News

News March 17, 2025

NZB: ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల: DEO

image

ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రెండు సమయాల్లో కొనసాగుతాయని వివరించారు. అలాగే ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 3 వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉంటాయన్నారు. కావున విద్యార్థులు పరీక్షల కోసం సన్నద్ధం కావాలని సూచించారు. సందేహాలు ఉంటే కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News March 17, 2025

‘రూ’ అక్షరాన్ని నిర్మలా సీతారామన్ కూడా వాడారు: స్టాలిన్

image

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం గతంలో తమిళ ‘రూ’ సింబల్ ని వాడారని CM స్టాలిన్ అన్నారు. ప్రస్తుతం మా ప్రభుత్వం కూడా ‘రూ’ అనే అక్షరాన్ని వినియోగించిందని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. తమ మాతృభాషను రక్షించుకోవడానికే NEPని వ్యతిరేకిస్తున్నామని, భాషపై గందరగోళం సృష్టించేవారు కేంద్రమంత్రి చర్య పైనా మాట్లాడాలని అన్నారు. బడ్జెట్ సమయంలో ‘రూ’ అక్షరం వాడటంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

News March 17, 2025

మెదక్: అగ్ని వీర్ కోసం యువత దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

యువత ఇండియన్ ఆర్మీలో చేరేందుకు అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని యువకులు ఇండియన్ ఆర్మీలో చేరి సేవలందించేందుకు ఆర్మీ రిక్రూట్మెంట్ ద్వారా అవకాశం ఉందని అన్నారు. అగ్ని వీర్ కోసం ఈ నెల 12 నుంచి https://www.joinindianarmy.nic.in వెబ్ పోర్టల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

error: Content is protected !!