News January 28, 2025
రిపబ్లిక్డే లో ఆకట్టుకున్న ముక్కామల కళాకారులు

అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి ఆధ్వర్యంలోని 16 మంది భరతనాట్యం కళాకారులు రిపబ్లిక్ డే లో ఆకట్టుకున్నారు. ఢిల్లీలో జరిగిన పెరేడ్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఏటి కొప్పాక బొమ్మలు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బొమ్మలతో రూపొందించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శకటానికి రెండు వైపులా నాగబాబు బృందం నృత్యం చేసింది. 2023 వేడుకల్లో ఏకాదశ రుద్ర ప్రభల నమూనా శకటంతో నాయకులను ఆకట్టుకున్నారు.
Similar News
News March 13, 2025
8 ఏళ్లలోపు పిల్లలు ఈ ఐస్క్రీమ్ తినొద్దు: UK సైంటిస్టులు

రంగులు కలిపే ముద్ద ఐస్లను పిల్లలు ఎంతో ఇష్టంగా సేవిస్తుంటారు. అయితే, గ్లిజరాల్ కలిగిన ఈ స్లష్ ఐస్ను 8ఏళ్ల లోపు చిన్నారులు తినడం ప్రమాదకరమని UK పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పరిశోధనలో పిల్లలు స్లషీ ఐస్ సేవించిన వెంటనే అస్వస్థతకు గురవడంతో అత్యవసర చికిత్స అందించాల్సి వచ్చిందని తెలిపారు. గ్లిజరాల్ వల్ల పిల్లలు స్పృహ కోల్పోతున్నారన్నారు. 8-11ఏళ్లలోపు పిల్లలు ఎప్పుడైనా ఒకటి తినొచ్చని సూచించారు.
News March 13, 2025
MNCL: క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి: CP

క్రమశిక్షణ నిబద్ధతతో కష్టపడి సరైన మార్గంలో విధులు నిర్వహించినప్పుడు గుర్తింపు వస్తుందని CP అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాల జోన్ పరిధిలో పనిచేస్తున్న SIలతో CP సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్క అధికారి వ్యక్తిగత జీవితానికి, సిబ్బంది జీవితాలకు విలువనివ్వాలన్నారు. సిబ్బందితో మాట్లాడి దర్బారు వంటివి నిర్వహిస్తూ సమస్యలు ఉంటే వారికి పెద్ద లాగా ఉండి పరిష్కరించాలని సూచించారు.
News March 13, 2025
పాడేరు: రేపు ‘మీకోసం’ కార్యక్రమం రద్దు

ఈనెల 14వ తేదీ శుక్రవారం జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘మీకోసం’ రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం హోలీ పండుగ ప్రభుత్వ సెలవు దినం పురస్కరించుకుని ‘మీకోసం’ రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ‘మీకోసం’ రద్దయిన సందర్భంగా స్థానిక, స్థానికేతర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ శుక్రవారం‘మీకోసం’ కార్యక్రమానికి రావద్దని కలెక్టర్ సూచించారు.