News April 11, 2025
రుషికొండ: రేపటి నుంచి శ్రీవారి లడ్డూ విక్రయాలు నిలిపివేత

విశాఖ రుషికొండలో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీవారి లడ్డూల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్య శుక్రవారం తెలిపారు. ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంకు శ్రీవారి లడ్డూల పంపిన నేపథ్యంలో ఇక్కడి విక్రయాలు నిలిపివేశామన్నారు. కావున భక్తులు గమనించాలని కోరారు.
Similar News
News December 13, 2025
మారికవలస: పురుగులు మందు తాగి యువకుడి మృతి

మారికవలసలోని ఏపీటీడబ్ల్యూఆర్ పాఠశాలలో అవుట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న ఉమా మహేశ్ (27) పురుగు మందు తాగి
శనివారం చనిపోయాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని సమాచారంతో యువకుడి తండ్రి నారాయణరావు పాఠశాలకు చేరుకున్నారు. ఆయన ఫిర్యాదుతో పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 13, 2025
విశాఖ వ్యాప్తంగా 336 దుకాణాల తొలగింపు

విశాఖలోని 8 జోన్లలో రహదారిపై ఆక్రమణల తొలగింపును జీవీఎంసీ శనివారం చేపట్టింది. తగరపువలస, బోయపాలెం, సమతా కాలేజీ, లీల మహల్, కంచరపాలెం, గాజువాక, శ్రీనగర్, సుజాతనగర్ ప్రాంతాల్లో రహదారులపై ఉన్న 336 దుకాణాలను ‘ఆపరేషన్ లంగ్స్’ పేరిట తొలగించామని చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్ తెలిపారు. ప్రజల రవాణా సౌకర్యాలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా ఫిర్యాదుల మేరకు తొలగింపులు చేపడుతున్నామని చెప్పారు.
News December 13, 2025
AU అల్యుమ్ని అనేది ఓ గొప్ప గుర్తింపు: ఆర్పీ పట్నాయక్

AU ‘వేవ్స్–2025’లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాల్గొన్నారు. ఇక్కడికి రాగానే తనకు క్యాంపస్ డేస్ గుర్తుకొచ్చాయని భావోద్వేగమయ్యారు ‘ఎక్కడ చదివినా.. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా ఒక్కసారి AUలో చదివిన తర్వాత అన్నీ మరిచిపోయి మీరు AU స్టూడెంట్ అయిపోతారు. AU అల్యుమ్ని అనేది ఓ గొప్ప గుర్తింపు’ అని పేర్కొన్నారు. సోషల్ వింగ్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు ముందుకు రావాలని కోరారు.


