News March 24, 2025
రూ.1.14 కోట్ల విద్యుత్ బిల్లులు వసూలు

విద్యుత్ బిల్లుల చెల్లింపుల కేంద్రానికి ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని వినియోగదారులు సద్వినియోగం చేసుకున్నారు. రెండు జిల్లాలలో మొత్తం10 వేల 200 మంది వినియోగదారులు బిల్లులు చెల్లించగా.. కోట్లు వసూలు అయినట్లు ట్రాన్స్కో ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, సురేంద్రనాయుడు వెల్లడించారు.
Similar News
News March 27, 2025
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అప్పుడేనా..?

మద్యం కేసులో MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగుతోంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టుకు సైతం వెళ్లారు. ఈక్రమంలో ఆయన లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏప్రిల్ 3 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఆ తర్వాత చికిత్స పొందుతున్న తన తండ్రి పెద్దిరెడ్డిని పరామర్శించడానికి వెళ్తారు’ అని ఆయన చెప్పారు. ఆ వెంటనే MPని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది.
News March 27, 2025
చిత్తూరు జిల్లాలో నేడే ఎన్నికలు.. క్షణం క్షణం ఉత్కంఠ

చిత్తూరు జిల్లా పరిధిలోని రామకుప్పం, తవణంపల్లె, సదుం, విజయపురం(వైస్ MPP), పెనుమూరు (కో-ఆప్షన్ సభ్యులు)లలో నేడు ఎన్నికలు జరగనున్నాయి. అటు YCP, ఇటు కూటమి ఈ ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా రామకుప్పంలో కూటమికి బలం లేకున్నా సభ్యులను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ YCP నేతలు ఆరోపించారు. తవణంపల్లెలో సైతం ఇరు వర్గాలు పోటాపోటీగా ఉన్నాయి. సదుం MPP ఎన్నికపై సైతం ఉత్కంఠ నెలకొంది.
News March 27, 2025
చిత్తూరు: వెబ్ సైట్లో టీచర్ల సీనియారిటీ జాబితా

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ టీచర్ల జనరల్ సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. జిల్లాలో పని చేస్తున్న హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్లు.. జనరల్ సీనియారిటీ జాబితాను సరిచూసుకోవాలన్నారు. అభ్యంతరాలపై 29వ తేదీలోపు డీఈఓ కార్యాలయంలో తెలియజేయాలన్నారు.