News June 14, 2024

రూ.100 కోట్ల అక్రమాలు.. బైరెడ్డిపై CIDకి ఫిర్యాదు

image

ఆడుదాం ఆంధ్రా, CM కప్ పేరిట అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం CEO ఆర్డీ ప్రసాద్ ఆరోపించారు. ఆ రెండు కార్యక్రమాల పేరిట రూ.100 కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వీటిపై విచారణ చేయాలని తాను CIDకి ఫిర్యాదు చేశానని చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఇంజినీరింగ్, IIITలో అడ్మిషన్లు పొందిన వారిపైనా విచారణ చేయాలని కోరారు.

Similar News

News October 2, 2024

కర్నూలు జిల్లా చరిత్రలో గాంధీ అడుగు జాడలు

image

భారత స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ 1921, 1929లో కర్నూల్ జిల్లాలో పర్యటించారు. 1921 SEP 29న తొలిసారి రైలులో కర్నూలు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో మహాత్ముడి ఉపన్యాసాలు లక్షలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. స్వరాజ్య నిధికి భారీ విరాళాలు అందజేశారు. అప్పట్లో జనాలను ఉద్దేశించి హిందీలో ప్రసంగించగా ఆయన ఉపన్యాసాన్ని కొండా వెంకటప్పయ్య పంతులు తెలుగులో అనువాదం చేశారు.
#GandhiJayanti

News October 2, 2024

కర్నూలు జిల్లా చరిత్రలో గాంధీ అడుగు జాడలు

image

భారత స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ 1921, 1929లో కర్నూల్ జిల్లాలో పర్యటించారు. 1921 SEP 29న తొలిసారి రైలులో కర్నూలు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో మహాత్ముడి ఉపన్యాసాలు లక్షలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. స్వరాజ్య నిధికి భారీ విరాళాలు అందజేశారు. అప్పట్లో జనాలను ఉద్దేశించి హిందీలో ప్రసంగించగా ఆయన ఉపన్యాసాన్ని కొండా వెంకటప్పయ్య పంతులు తెలుగులో అనువాదం చేశారు.
#GandhiJayanti

News October 2, 2024

నంద్యాల: గ్రీన్ కో పవర్ లైన్‌పై సమీక్ష

image

గ్రీన్ కో ఎలక్ట్రికల్ పవర్ లైన్ ట్రాన్స్మిషన్ ఏర్పాటుపై కలెక్టర్ రాజకుమారి మంగళవారం నంద్యాల కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్‌తో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో గ్రీన్ కో ఎలక్ట్రికల్ పవర్ లైన్ ట్రాన్స్మిషన్‌కు సంబంధించి షెడ్యూల్ కులాల హక్కులకు భంగం కలగకుండా డివిజనల్ కమిటీ సూచించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని పేర్కొన్నారు.