News March 28, 2025

రూ.14 లక్షలు పలికిన ఒంగోలు గిత్త

image

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని డి.రంగాపురం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి ఒంగోలు జాతి గిత్తను రూ.14 లక్షలకు విక్రయించారు. ప్రకాశం జిల్లా ముదిరముప్పాల గ్రామానికి చెందిన శేషాద్రి చౌదరి గిత్తను కొనుగోలు చేశారు. ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఈ ఒంగోలు గిత్త ఎడ్ల పోటీల్లో సత్తా చాటుతోంది. ఇది వరకు పలు పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బహుమతులను గెలుపొందింది.

Similar News

News April 2, 2025

కర్నూలు జిల్లాలో పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా.. మంగళవారం కర్నూలులోని సాయిబాబా సంజీవ నగర్‌లో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వితంతు, వృద్ధాప్య పెన్షన్‌లను వారి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పంపిణీ చేశామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు హాజరయ్యారు.

News April 1, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤కర్నూలులో మొదటి రోజు 93% పూర్తయిన పింఛన్ల పంపిణీ
➤ కర్నూలు: టెన్త్ పరీక్షలకు 430 మంది గైర్హాజరు-డీఈఓ
➤ కర్నూలు: సెక్షన్ 11 నోటీస్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు- సబ్ కలెక్టర్
➤ కర్నూలు జిల్లాలో 9 కరవు మండలాలు
➤ కర్నూలు జిల్లాలో వింత ఆచారం
➤ పెద్దకడబూరు: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
➤ కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

News April 1, 2025

కర్నూలులో మొదటి రోజు 93% పూర్తయిన పింఛన్ల పంపిణీ

image

కర్నూలు జిల్లాలోని 29 మండలాల్లో మంగళవారం చేపట్టిన పింఛన్ పంపిణీ 93% పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 2,38,302 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, మొదటి రోజు 2,21,701 మందికి పింఛన్ పంపిణీ పూర్తయింది. ఇంకా 16,601 మందికి పింఛన్ పంపిణీ చేయాల్సి ఉంది. కాగా జిల్లాలోని కర్నూల్ అర్బన్‌లో 95% పంపిణీతో మొదటి స్థానం, 88%తో తుగ్గలి మండలం చివరి స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!