News March 28, 2025
రూ.165 లక్షలతో ఆరోగ్య సేవల మెరుగు..IOCL

ఇండియన్ ఆయిల్ TAPSO HYDలో ఆరోగ్య సేవలను మెరుగుపర్చేందుకు 3 ఒప్పందాలు కుదుర్చుకుని రూ.165 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ నిధులతో స్వీకార్ అకాడమీలో ఆటిజం బాధిత పిల్లలకు ప్రత్యేక సంరక్షణ, కోఠిలో ప్రభుత్వ ENT ఆసుపత్రిలో వినికిడి లోపం ఉన్నవారికి అవసరమైన పరికరాలు, మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్, వైద్య పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
Similar News
News April 2, 2025
ఎండాకాలంలో ఈ ఆహారం తింటున్నారా?

సమ్మర్లో ఆరోగ్య నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం ఆవిరితో చేసిన ఇడ్లీలు, కుడుములు తినాలి. మాంసాహారం, వేపుళ్లకు దూరంగా ఉండాలి. భోజనంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. నిల్వ పచ్చళ్లను పరిమితంగా తీసుకోవాలి. మామిడి, పుచ్చకాయ వంటి పండ్లను తినాలి. మజ్జిక, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తాగాలి. కూల్ డ్రింక్స్, కాఫీ, టీలకు దూరంగా ఉండటం బెటర్.
News April 2, 2025
DANGER: రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా?

స్మార్ట్ ఫోన్లలో విపరీతంగా రీల్స్, షార్ట్స్ చూడటం వ్యసనంగా మారింది. దీనివల్ల బ్రెయిన్ రాట్(మేధో క్షీణత), కంటి జబ్బులు అధికమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లల్లో మెల్లకన్ను, డ్రై ఐ సిండ్రోమ్, మయోపియా కేసులు, పెద్దల్లో మైగ్రేన్, నిద్రలేమి సమస్యలు పెరుగుతున్నాయంటున్నారు. 20-20-20 రూల్(20ని.కోసారి 20సె.పాటు 20మీ. దూరంలో వస్తువులపై దృష్టి పెట్టడం) పాటించాలని సూచిస్తున్నారు.
News April 2, 2025
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అక్రమార్కుడు: ఎమ్మెల్యే

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిని విస్మరించి అక్రమంగా రూ.కోట్లు ఆర్జించాడని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో ఒక్క రేషన్ కార్డు కానీ,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కానీ మాజీ ఎమ్మెల్యే ఇవ్వలేదన్నారు.గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చిప్ప చేతికిచ్చారన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సీఎం హామీలను అమలు చేస్తున్నారన్నారు.