News June 29, 2024
రూ.1,861 కోట్లను దోచేశారు: ఎంపీ బైరెడ్డి శబరి
ప్రజాధనం దుర్వినియోగం చేసిన దోషులను శిక్షించాలని ఎంపీ బైరెడ్డి శబరి ప్రభుత్వాన్ని కోరారు. ‘వైసీపీ పాలనలో ప్రజాధనం ఎంతలా దుర్వినియోగం అయిందో చెప్పేందుకు ఇదొక నిదర్శనం. మాజీ సీఎం జగన్ ప్రచార పిచ్చి కోసం ప్రత్యేకంగా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏకంగా రూ.1,861 కోట్లను దోచేశారు. ఈ అక్రమాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి ప్రజాధనం దుర్వినియోగం చేసిన దోషులకు శిక్షించాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News September 21, 2024
రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న ఆకాశ్ పూరీ
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని సినీ హీరో ఆకాశ్ పూరీ దర్శించుకున్నారు. ఆయనకు శ్రీమఠం అధికారులు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. గ్రామ దేవత శ్రీ మంచాలమ్మ దేవి, గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు ఫలమంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.
News September 21, 2024
పత్తికొండలో క్వింటా టమాటా రూ.3,200
రాష్ట్రంలో మదనపల్లి తర్వాత కర్నూలు జిల్లాలోని పత్తికొండ టమాటా మార్కెట్ అతిపెద్దది. జిల్లాలోని తుగ్గలి, మద్దికేర, ఆలూరు, ఆస్పరి తదితర మండలాల నుంచి పత్తికొండ మార్కెట్కు రైతులు పెద్ద ఎత్తున టమాటాలు తీసుకొస్తారు. వారం రోజులుగా ఈ మార్కెట్లో ధరలు నిలకడగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కిలో గరిష్ఠంగా రూ.30పైనే పలుకుతున్నాయి. నిన్న క్వింటా టమాటా గరిష్ఠంగా రూ.3,200 పలికింది.
News September 21, 2024
విద్యార్థుల మంచి మనసు.. నంద్యాల కలెక్టర్కు విరాళం అందజేత
విద్యార్థులు తాము దాచుకున్న పాకెట్ మనీని వరద బాధితుల సహాయార్థం అందించడం అభినందనీయమని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులు ఇచ్చిన రూ.11,675ల మొత్తాన్ని శుక్రవారం కలెక్టర్ రాజకుమారికి అందించారు. ఉన్నతాధికారులు విద్యార్థులను అభినందించారు.