News March 1, 2025

రూల్స్ అతిక్రమిస్తే జరిమానా: సీపీ రాజశేఖరబాబు

image

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,000 జరిమానా, 3 నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 194 డి ప్రకారం ఈ మేరకు రూ.1,000 జరిమానా విధిస్తామని, బైక్‌లు నడిపేవారు హెల్మెట్ ధరించి సురక్షితంగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవాలని సూచించారు.

Similar News

News March 1, 2025

కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

image

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే కామారెడ్డి వాసులు భయపడుతున్నారు. కామారెడ్డిలో ఇవాళ, రేపు 34 నుంచి 36°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.

News March 1, 2025

దోమలో బాలికపై యువకుడి అఘాయిత్యం

image

నాలుగేళ్ల బాలికపై యువకుడు లైంగికదాడికి యత్నించిన ఘటన దోమ PS పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువకుడు (20), తన ఇంటి సమీపంలో ఉండే చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు.

News March 1, 2025

నిజామాబాద్ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

image

నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే నిజామాబాద్ వాసులు భయపడుతున్నారు. నిజామాబాద్‌లో ఇవాళ, రేపు 36°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.

error: Content is protected !!