News February 7, 2025
రెండు కుటుంబాలను చిదిమేసిన రోడ్డు ప్రమాదం
ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తీక్(21), తరుణ్(19) <<15378854>>మృతి చెందిన<<>> సంగతి విదితమే. సరదాగా బైక్పై బయటకు వెళ్లిన ఇద్దరినీ మృత్యువు కబళించింది. కాగా చిన్న వయస్సులోనే ఇంటి బాధ్యతలు మోస్తున్న యువకులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కార్తీక్ తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందగా ప్రస్తుతం రవాణా కూలీగా చేస్తున్నారు. తరుణ్ ఓ బట్టల షాపులో పని చేస్తున్నారు.
Similar News
News February 7, 2025
శ్రీకాకుళం: యాచనకు వచ్చి.. మహిళపై దాడి
యాచనకు వచ్చిన ఓ మహిళ గురువారం రాత్రి శ్రీకాకుళం నగరానికి చెందిన గృహిణిపై దాడి చేసింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. సీమనాయుడుపేటకు చెందిన జయలక్ష్మి కుటుంబం సభ్యులు అందరూ బయటకు వెళ్లారు. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్న సమయంలో ఒక మహిళ యాచనకు వచ్చి ఒంటరిగా ఉన్న ఆమెపై దాడి చేసింది. ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకునేందుకు ప్రయత్నించగా జయలక్ష్మి ప్రతిఘటించి కేకలు వేసింది. స్థానికులు రావడంతో ఆ మహిళ పరారైంది.
News February 7, 2025
SKLM: రహదారి నిర్మాణానికి రూ.45.50 కోట్లు మంజూరు
వెంకటాపురం నుంచి సంతబొమ్మాలి మండలం నౌపడ రహదారి నిర్మాణానికి రూ.45 కోట్ల 50 లక్షలు మంజూరైనట్లు సామాజిక కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు గురువారం తెలిపారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గతంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి ఆధ్వర్యంలో నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఆయన రహదారి నిర్మాణానికి కృషి చేసినట్లు పేర్కొన్నారు.
News February 7, 2025
శ్రీకాకుళం: రహదారి విస్తరణకు రూ.107 కోట్లు మంజూరు
సుదీర్ఘ ప్రాంత గ్రామాలకు అనుసంధానంగా ఉన్న డీపీఎన్ రహదారి విస్తరణ, తారు రోడ్డు నిర్మాణం పనులకు ఎన్డీఏ ప్రభుత్వం రూ.107 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి కిజరాపు అచ్చెన్నాయుడు గురువారం తెలిపారు. పోలాకి మండలం, డోల గ్రామాల నుంచి సంతబొమ్మాళి మండలం నౌపడ వరకు రెండు లైన్ల రహదారి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. టీడీపీ నాయకులు మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు తెలిపారు.