News March 22, 2025

రెబ్బెన: గంగాపూర్ కారోబార్ ఆత్మహత్య

image

రెబ్బెన మండలం గంగాపూర్ కారోబార్ ప్రకాశ్ పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. సూసైడ్ నోట్ ప్రకారం.. అదే గ్రామానికి చెందిన గుర్ల సోనీ డబ్బులు ఇవ్వమని లేకపోతే కేసు పెడతానని బెదిరించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రకాశ్ పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. తన చావుకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని BJP నాయకులు డిమాండ్ చేశారు.

Similar News

News March 23, 2025

చంద్రబాబు పర్యటనపై ఎమ్మెల్యే ఏలూరి వీడియో కాన్ఫరెన్స్

image

ఏప్రిల్ ఒకటిన సీఎం చంద్రబాబు పర్చూరు నియోజకవర్గంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటన ఏర్పాట్లపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులకు పలు సూచనలు చేశారు.

News March 23, 2025

ఎన్టీఆర్: ఆ నిర్ణయంతో వేలాది మందికి చేకూరనున్న లబ్ధి 

image

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్(RTF) కింద రూ.600కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ తాజాగా ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో ఎన్టీఆర్ జిల్లాలోని వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. త్వరలో మరో రూ.400కోట్లు విడుదల చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. ఫీజు చెల్లించని విద్యార్థులను పరీక్షలకు అనుమతించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన Xలో హెచ్చరించారు.

News March 23, 2025

మార్కాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సూసైడ్

image

కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మార్కాపురంలో చోటుచేసుకుంది. స్థానిక కొండేపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న చదలవాడ పద్మజ (52) ZPH బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంటున్నట్లు SI సైదుబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

error: Content is protected !!