News February 8, 2025
రెబ్బెన: గంగాపూర్ జాతర ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738932558837_51979135-normal-WIFI.webp)
రెబ్బెన మండలం గంగాపూర్లో ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరను అధికారులు సమన్వయంతో కృషిచేసి విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జాతర ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. జాతర వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాల పార్కింగ్, భారీ కేడ్లు, తాగునీరు, తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించాలన్నారు.
Similar News
News February 8, 2025
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738982707611_1259-normal-WIFI.webp)
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్స్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పట్టభద్రులు గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి మోసపూరిత వాగ్దానాలకు బలయ్యారన్నారు.
News February 8, 2025
మెదక్: నేడు పాఠశాలలకు పనిదినం: డీఈవో
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738980715166_50061539-normal-WIFI.webp)
మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు నేడు (శనివారం) పని చేస్తాయని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించినందుకు, శనివారం పాఠశాలలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు తరగతులకు గైర్హాజరు కాకుండా చూడాలని సూచించారు.
News February 8, 2025
తడ : హైవేపై ప్రమాదం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738948162622_60317407-normal-WIFI.webp)
తడ మండలం కొండూరు హైవేపై ప్రమాదం జరిగింది. సూళ్లూరుపేట వైపు నుంచి తడ వైపు బైక్పై వెళుతున్న సినోఫర్ మహమ్మద్ (నెల్లూరు), జ్యోతి బాబే (గుమ్మిడిపూడి) అనే ఇద్దరు యువకులు ముందు వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సును ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన తడ హైవే మొబైల్ వాహనం సహాయంతో సూళ్లూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు.