News April 13, 2025
రేగొండ: విద్యుత్ షాక్తో మహిళ మృతి

రేగొండ మండలం రాయపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన నీటూరి నీలమ్మ (59) ఆదివారం ఉదయం ఇంటి వద్ద పనులు చేస్తూ కిటికీ ఊచలను పట్టుకుంది. ఇంట్లోకి వెళ్లే విద్యుత్ తీగలు కిటికికీ తాకడంతో కిటికీని పట్టుకున్న నీలమ్మకు షాక్ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 15, 2025
లా కమిషన్ ఛైర్మన్గా దినేశ్ మహేశ్వరి

సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి 23వ లా కమిషన్ ఛైర్మన్గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హితేశ్ జైన్, DP వర్మను సభ్యులుగా నియమించింది. 2027 ఆగస్టు 31వరకు వీరు ఈ పదవిలో కొనసాగనున్నారు.
News April 15, 2025
నిబద్ధతతో పని చేయాలి: MHBD ఎస్పీ

పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే నిబద్ధతతో పని చేయాలని MHBD ఎస్పీ రామ్నాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్లో కోర్టు డ్యూటీ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. కోర్టు డ్యూటీలో నిర్లక్ష్యం వహించకూడదని, కేసు ఛార్జి షీట్లను నిర్దేశిత కాలంలో న్యాయస్థానాలకు సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
News April 15, 2025
డబ్బులేక రోడ్డు పక్కనే పడుకునేవాడిని: షారుఖ్

కెరీర్ తొలినాళ్లలో ముంబైలో అద్దె కట్టేందుకు కూడా డబ్బు లేక రోడ్డు పక్కన పడుకునేవాడినని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘మనిషికి ఇల్లు, చదువు ఉంటే ప్రపంచం చేతిలో ఉన్నట్లే. ఉద్యోగం, డబ్బు లేకపోయినా ఫర్వాలేదు కానీ నిద్రపోవడానికి, బాధగా ఉన్నప్పుడు కూర్చుని ఏడవడానికి ఓ నీడ కచ్చితంగా ఉండాలి. నా పిల్లలకు నా పరిస్థితి ఉండకూడదని ముందుగానే ఇల్లు కట్టుకున్నాను’ అని తెలిపారు.