News March 9, 2025
రేపు యధావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం: ఎస్పీ

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం యధావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుందని ఏలూరు ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీసు, సబ్ డివిజనల్ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్జీదారులు గమనించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News March 10, 2025
ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ తరఫున నెల్లికంటి సత్యం పేర్లు ఖరారయ్యాయి. BRS దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించింది. ఏపీలో టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన తరఫున నాగబాబు టికెట్లు దక్కించుకున్నారు. బీజేపీ అభ్యర్థిని నేడు ప్రకటించనున్నారు.
News March 10, 2025
నల్గొండ: టీమ్ ఇండియా క్రీడాకారులకు మంత్రి కోమటిరెడ్డి విషెస్

అద్భుతమైన ఆట తీరుతో, అప్రతిహత విజయాలతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నెగ్గిన భారత క్రికెట్ జట్టుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ టోర్నీలో, టీమిండియా విజయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు పలువురు క్రీడాకారులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
News March 10, 2025
ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. అభిమానుల హర్షం

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పేరు ఖరారు కావడంతో మెదక్ ప్రాంతంలో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి 2009 నుంచి 2014 వరకు మెదక్ ఎంపీగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీచేసి ఓడిపోయారు. ఆమె బీజేపీలోనూ పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు.