News March 21, 2024
రేపు లా సెట్ నోటిఫికేషన్ విడుదల

ఏపీలో న్యాయ శాస్త్ర కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేస్తున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ బి.సత్యనారాయణ తెలిపారు. నాగార్జున యూనివర్సిటీలోని లాసెట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, వీసీతో కలిసి నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు.
Similar News
News April 9, 2025
తెనాలిలో గంజాయి అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్

ఇతర ప్రాంతాల నుంచి తెనాలికి గంజాయి తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్న నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రమేశ్ బాబుతో కలిసి డీఎస్పీ జనార్ధనరావు నిందితుల వివరాలను తెలిపారు. గుంటూరుకు చెందిన రాజశేఖర్ రెడ్డి ,పేరేచర్లకు చెందిన అరుణ్ కుమార్, తెనాలికి చెందిన ప్రకాశ్ బాబు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయాలు జరుపుతుండగా అరెస్టు చేసి 1.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News April 9, 2025
గుంటూరు మీదుగా హుబ్లీ-కతిహార్ మార్గంలో ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్థం గుంటూరు మీదుగా హుబ్లీ-కతిహార్ మార్గంలో కొత్తగా ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. హుబ్లీ-కతిహార్(07325) ప్రత్యేక రైలు ఏప్రిల్ 9 నుంచి 30వ తేదీ వరకు ప్రతీ బుధవారం హుబ్లీ నుంచి బయలుదేరి గుంటూరు మీదుగా కతిహార్ చేరనుంది. ఇదే మార్గంలో కతిహార్-హుబ్లీ(07326) రైలు ఏప్రిల్ 12 నుంచి మే 3వ తేదీ వరకు ప్రతి శనివారం కతిహార్ నుంచి బయలుదేరుతుంది.
News April 9, 2025
గుంటూరు: డెలివరీ బాయ్స్ వివరాలు నమోదు చేయండి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 18-59 సంవత్సరాల వయస్సు గల డెలివరీ బాయ్స్ సహా అసంఘటిత రంగం కార్మికులు తమ వివరాలు ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సంయుక్త కార్మిక కమిషనర్ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. సోమవారం ప్రారంభమైన ఈ ప్రత్యేక డ్రైవ్ ఈనెల 17వ తేదీ వరకు కొనసాగనుందన్నారు. ఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని, కార్మికులు తమ ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలతో నమోదు చేసుకోవాలన్నారు.