News September 16, 2024
రేపే నిమజ్జనం.. ఖైరతాబాద్ గణేశ్ ఎంత బరువంటే?
70 టన్నుల ఖైరతాబాద్ గణేశ్ రేపు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కాగా విగ్రహ తయారీ అప్పుడు 30 టన్నుల స్టీలు, గుజరాత్ గాంధీనగర్ నుంచి 35 కిలోల బరువున్న ప్రత్యేక మట్టి 1000 బ్యాగులు, 50 కిలోల బరువున్న 100 బండిళ్ల వరి గడ్డి, 10 కిలోల బరువున్న వరి పొట్టు 60 బస్తాలు, 10 ట్రాలీల సన్న ఇసుక, 2 వేల మీటర్ల గోనె బట్ట, 80 కిలోల సుతిలీ తాడు, 5 వేల మీటర్ల మెష్, 2500 మీటర్ల కోరా బట్ట, టన్ను సుతిలీ పౌడర్ వినియోగించారు.
Similar News
News September 28, 2024
HYD: స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు.
News September 28, 2024
డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ దర్శనం క్యాన్సిల్ చేసుకున్నాడు: బండి
తిరుమల దర్శనం కోసం డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే ఏపీ మాజీ సీఎం జగన్ దర్శనాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రస్తుత పరిణామాలు, జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగానే లడ్డు అపవిత్రత అయిందని అనిపిస్తుందన్నారు.హిందూ మతంపై దాడి జరిగినప్పుడు కేవలం RSS, VHP లాంటి సంస్థలే పోరాడుతాయని ఊరుకుంటే సరిపోదని, ప్రతి ఒక్క హిందువు కొట్లాడాలన్నారు.
News September 28, 2024
జవహర్నగర్ డంపింగ్ యార్డుకు భారం తగ్గేలా చర్యలు
ఏళ్లుగా HYD నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా దానికి భారం తగ్గించేందుకు GHMC ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో స్థలాలను గుర్తిస్తోంది. RRజిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్లో 42.22 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారంలో 100, దుండిగల్లో 85, మల్కాపూర్లో 200ఎకరాలను గుర్తించింది.