News April 17, 2025
రేషన్ కార్డుల దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

రేషన్ కార్డులకు సంబంధించి కొత్త కార్డులు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్పుల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలని భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో రేషన్ కార్డుల విచారణ, ఆన్లైన్ నమోదు తదితర అంశాలపై తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. దరఖాస్తులను వెంటనే విచారణ చేసి అర్హత మేరకు మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాలన్నారు.
Similar News
News April 20, 2025
కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు

కార్పొరేట్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు ప్రేమ్ కరణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో బోధన సాగిస్తూ కాంపిటిటీవ్ పరీక్షల్లో ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత సాధిస్తున్న కళాశాలలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
News April 20, 2025
నెల్లిమర్ల ఛైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం..?

నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్పర్సన్ బంగారు సరోజినీపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు జోరుగా చర్చ సాగుతుంది. ప్రస్తుతం ఈమె జనసేనలో ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే కౌన్సిలర్లు చర్చించినట్లు సమాచారం. పొత్తులో ఉన్న TDP, జనసేన సఖ్యత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తం 20 వార్డుల్లో TDPకి 7, YCPకి 9, BJPకి 1, జనసేనకు 3 చొప్పున సభ్యుల బలం ఉంది. సభ్యులు సహకరిస్తే TDPకి ఛైర్మన్ దక్కే అవకాశం ఉంది.
News April 20, 2025
AMP: జిల్లాలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు

కోనసీమ జిల్లాలో ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించనున్నామని డీఈవో షేక్ సలీం భాష తెలిపారు. ఆయన అమలాపురం నుంచి శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలలో పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఆసక్తి కలిగిన వారు 26వ తేదీలోపు వెబ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.