News March 20, 2025
రైతుల నుంచి ఫిర్యాదులు రాకూడదు: జేసీ

రీ సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి అయిన గ్రామాలలోని రైతులకు 9(2) నోటీసులను అందచేయాలని జేసీ రాహుల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ డివిజన్ అధికారులతో మాట్లాడారు. 13 గ్రామాలలో రైతులకు 9(2) నోటీసులను అందజేయాలన్నారు. ఏ ఒక్క రైతుకు తన భూమికి సంబంధించి నోటీసులు అందలేదని ఫిర్యాదులు రాకూడదన్నారు.
Similar News
News March 20, 2025
తాడేపల్లిగూడెం యువకుడిపై పోక్సో కేసు

తాడేపల్లిగూడేనికి చెందిన సత్య అనే యువకునిపై విశాఖలో పోక్సో కేసు నమోదైంది. విశాఖకు చెందిన 17 ఏళ్ల బాలిక డెంటల్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. స్వీట్ షాపులో పనిచేస్తున్న సత్యతో పరిచయం ఏర్పడింది. ఈనెల 15న ఇంటి నుంచి వెళ్లిన బాలిక తిరగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు 4వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరూ విజయవాడలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు విశాఖ తీసుకోచ్చారు. సత్యపై పోక్సో కేసు నమోదు చేశారు.
News March 20, 2025
ప.గో : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 377 మంది దూరం

టెన్త్ విద్యార్థులకు బుధవారం ద్వితీయ భాష హిందీ పరీక్ష జరిగింది. పరీక్షకు 21999 మంది విద్యార్థులకు గాను 21622 మంది విద్యార్థులు హాజరు కాగా 377 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 98.29% శాతం హాజరయ్యారని డిఇఓ నారాయణ తెలిపారు. అలాగే ఓపెన్ స్కూల్ ఆంగ్ల పరీక్షకు 457 మంది విద్యార్థులకు గాను 370 విద్యార్థులు హాజరు కాగా 87 గైర్హాజరయ్యారన్నారు.
News March 20, 2025
ట్రాన్స్జెండర్ హత్య.. ప.గో జిల్లా వాసి అరెస్ట్

అనకాపల్లి జిల్లాలో దీపు అనే ట్రాన్స్జెండర్ హత్య కలకలం రేపింన విషయం తెలిసిందే. అయితే ఇరగవరం(M) పొదలాడకు చెందిన బన్నీనే ఆ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నాలుగేళ్ల నుంచి ఆమెతో సహజీవనం చేస్తూ..గొడవలు రావడంతో హత్య చేసినట్లు సమాచారం. కశింకోట మండలం బయ్యవరంలో హంతకుడు ఆమె నడుము కింది భాగం, కాలు, చేయి మూట కట్టి పడేశాడు. దీంతో జిల్లా ఇన్ఛార్జ్ SP వకుల్ జిందాల్ 8 టీమ్లతో దర్యాప్తు చేసి కేసు చేధించారు.