News March 22, 2025

రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి: జేసీ

image

జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. వాటిని రైతులు వినియోగించుకోవాలని కోరారు. కందులకు రూ.7,550, శనగలకు రూ.5,650, మినుములకు రూ.7,400 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించామన్నారు. బహిరంగ మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని రైతులు విక్రయించి, ప్రభుత్వ కనీసం మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.

Similar News

News March 25, 2025

ప్రకాశం: యువతకు గమనిక

image

ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్ని వీర్ టెక్నికల్, అగ్ని వీర్ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్ని ట్రేడ్స్ మెన్ విభాగాల్లో ఉద్యోగ నియామకాలకు యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఒంగోలు స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ సూచించారు. ఏప్రిల్ 10వ తేదీ లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తెలుగులోనే ఎగ్జాం నిర్వహిస్తారన్నారు. ఎన్‌సీసీ వారికి బోనస్ మార్కులు ఉంటాయన్నారు.

News March 25, 2025

ప్రకాశం: వారికి ఆన్‌లైన్‌లో పరీక్ష

image

ప్రకాశం: ఎయిడెడ్ ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఆన్‌లైన్ ద్వారా పరీక్ష రాయాలని DEO కిరణ్ కుమార్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు పొందాలని సూచించారు. ఈనెల 28, 29వ తేదీల్లో ఆన్లైన్ ద్వారా పరీక్ష రాయాలన్నారు. మ్యాన్యువల్‌గా దరఖాస్తు చేసిన వారు అప్లికేషన్ తీసుకుని DEO ఆఫీసులో సంప్రదిస్తే హాల్ టికెట్ అందిస్తామని చెప్పారు.

News March 25, 2025

ఒంగోలు: యువకుల ఫోన్ల తనిఖీ

image

IPL బెట్టింగ్‌తో పాటు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈక్రమంలో పోలీసులు నిఘా పెంచారు. ఒంగోలు బస్టాండ్ వద్ద డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు యువకుల ఫోన్లు చెక్ చేశారు. బెట్టింగ్ యాప్స్, సింగిల్ నంబర్ వాడే వారిని గుర్తించారు. 300 మంది అనుమానితులను తనిఖీ చేసి రూ.5,500 సీజ్ చేశారు. యువత బెట్టింగ్‌కు అలవాటై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని డీఎస్పీ కోరారు.

error: Content is protected !!