News February 22, 2025
లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్

బీబీనగర్ మండల పరిధిలోని పడమటి సోమవారంలో లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్ హనుమంతరావుకు నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఛైర్మన్ సందిగారి బసవయ్య, ధర్మకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Similar News
News February 23, 2025
దుబాయ్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ సందడి

యంగ్టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ దుబాయ్లో సందడి చేస్తోంది. ఓ ప్రైవేట్ ఫ్యామిలీ ఫంక్షన్లో ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి మెరిశారు. వీరితోపాటు మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా కనిపించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కించే ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది.
News February 23, 2025
జన్నారం: ఈ స్వామి మౌనదీక్షకు 50 ఏళ్లు

జన్నారం మండలం రోటిగూడ గీతా మందిర్ నిర్వాహకులు స్వామి మౌన దీక్షకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రజలలో ఆధ్యాత్మిక భావనను పెంచేందుకు 1975లో ఆయన మౌన దీక్షను చేపట్టారు. అప్పటినుంచి మౌనస్వామి గీతాశ్రమం ద్వారా పూజా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మౌనస్వామి మౌనదీక్ష చేపట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్, భక్తులు ఆయనను సన్మానించారు.
News February 23, 2025
జన్నారం: ఈ స్వామి మౌనదీక్షకు 50 ఏళ్లు

జన్నారం మండలం రోటిగూడ గీతా మందిర్ నిర్వాహకులు స్వామి మౌన దీక్షకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రజలలో ఆధ్యాత్మిక భావనను పెంచేందుకు 1975లో ఆయన మౌన దీక్షను చేపట్టారు. అప్పటినుంచి మౌనస్వామి గీతాశ్రమం ద్వారా పూజా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మౌనస్వామి మౌనదీక్ష చేపట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్, భక్తులు ఆయనను సన్మానించారు.