News April 4, 2025

లోకేశ్ నీ స్థాయి తెలుసుకుని మాట్లాడు: అంబటి

image

AP: మంత్రి లోకేశ్ తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారి గురించి అనుచితంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ‘రెడ్ బుక్ చూసి గుండెపోటు వచ్చిందని లోకేశ్ వ్యాఖ్యానించడం సరికాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం ఉందని లోకేశ్ వికటాట్టహాసం చేస్తున్నారు. అధికార మదంతో ఆయనకు కళ్లు నెత్తికెక్కాయి’ అని అంబటి ఫైర్ అయ్యారు.

Similar News

News April 11, 2025

వెయ్యి రోజులుగా ఆగని పీరియడ్స్.. మహిళ ఆవేదన

image

తనకు వెయ్యి రోజులుగా రుతుస్రావం అవుతున్నట్లు అమెరికాకు చెందిన టిక్‌టాకర్ పాపి వెల్లడించారు. 950 రోజుల తీవ్ర ఆవేదన తర్వాత ఆమె ఈ విషయాన్ని తన యూజర్లతో పంచుకున్నారు. మహిళలకు సాధారణంగా నెలలో 3-7 రోజుల పాటు పీరియడ్ బ్లీడింగ్ జరుగుతుంటుంది. మొదట్లోనే టెస్టులు చేయించానని, వైద్యులు సైతం అయోమయంలో పడినట్లు ఆమె తెలిపారు. చివరికి తనకు బైకార్న్యుయేట్ యుట్రస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

News April 11, 2025

నెగటివ్ ప్రచారంపై ఘాటుగా స్పందించిన హీరోయిన్

image

సోషల్ మీడియాలో నెగటివిటీని ప్రచారం చేసే వారికి ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుందని హీరోయిన్ త్రిష ఇన్‌స్టాలో ప్రశ్నించారు. ఖాళీగా కూర్చొని ఇతరులపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు చేయడమే పనా అని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వారితో కలిసి జీవించేవారి గురించి ఆలోచిస్తే బాధగా అనిపిస్తుందన్నారు. నిన్న విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకి తమిళంలో డబ్బింగ్ చెప్పకపోవడంతో SMలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

News April 11, 2025

పెండింగ్ కేసుల పరిష్కారానికి త్వరలో ఈవెనింగ్ కోర్టులు!

image

జిల్లా కోర్టుల్లోని పెండింగ్ కేసుల పరిష్కారానికి దేశవ్యాప్తంగా 785 ఈవెనింగ్ కోర్టులు ఏర్పాటు చేయాలని న్యాయ శాఖ యోచిస్తోంది. ప్రస్తుత కోర్టు ప్రాంగణాల్లోనే సాధారణ పనివేళల అనంతరం 5pm-9pm మధ్య ఇవి పనిచేస్తాయని సమాచారం. గత 3 ఏళ్లలో రిటైరైన జడ్జీలను కాంట్రాక్టు పద్ధతిలో వీటిలో నియమిస్తారని తెలుస్తోంది. మైనర్ క్రిమినల్ కేసులు, 3 ఏళ్ల వరకూ జైలుశిక్ష విధించదగిన కేసులను ఈ కోర్టుల్లో విచారించనున్నారు.

error: Content is protected !!