News April 19, 2025

వందేళ్ల వరకు భూ సమస్య లేని విధంగా భూభారతి: కలెక్టర్ గౌతం

image

వందేళ్ల వరకు భూసమస్యలు లేని విధంగా భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని కలెక్టర్ గౌతం తెలిపారు. శనివారం కేశవరంలోని సూపర్ సంగీత్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. భూముల సమస్యలలో శాశ్వత పరిష్కారం భూభారతిలో జరుగుతుందన్నారు. అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, ఎమ్మార్వో వెంకటనరసింహారెడ్డి పాల్గొన్నారు.

Similar News

News April 20, 2025

లక్ష్మణచాంద: వాగులో బాలుడి మృతదేహం లభ్యం

image

లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన మద్దెల రాంచరణ్ (14)అనే బాలుడి మృతదేహం స్థానిక వాగులో ఆదివారం లభ్యమైంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. రాంచరణ్ రోజూ లాగే శనివారం మధ్యాహ్నం దోస్తులతో కలిసి వాగులో స్నానం చేయటానికి వెళ్లాడు. ఎస్సారెస్పీ కెనాల్ ప్రవహిస్తున్న కారణంగా వాగులో నీటి ఉద్ధృతి పెరిగి రాంచరణ్ నీటిలో మునిగిపోయి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 20, 2025

విమానాన్ని ఢీకొట్టిన టెంపో వ్యాన్!

image

బెంగళూరు ఎయిర్‌పోర్టులో నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఓ టెంపో వ్యాన్ ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విమానం కింద వ్యాన్ ఇరుక్కున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఘటనపై ఇండిగో స్పందించింది. ‘బెంగళూరులో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు జరుగుతోంది. అది పూర్తైన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. టెంపో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

News April 20, 2025

ప్రైవేట్ స్కూల్లో ప్రవేశం పొందవచ్చు: అల్లూరి డీఈవో

image

అభాగ్యులు, అనాధ పిల్లలు ఇకపై నేరుగా మీకు దగ్గరలో గల ఏ ప్రైవేట్ పాఠశాలలో (cbse, స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న ) అయినా 1వ తరగతిలో ప్రవేశం పొందవచ్చని అల్లూరి DEO బ్రహ్మాజీరావు ఆదివారం తెలిపారు. ఈ మేరకు 25% కోటా కేటాయించాలని అన్ని ప్రైవేట్ స్కూల్స్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈనెల 28 నుంచి మే 15 తేదీలోగా https://cse.ap.gov.in ద్వారా online దరఖాస్తు చేసుకొని బడిలో చేరాలన్నారు.

error: Content is protected !!