News April 9, 2024

వడదెబ్బ నుంచి రక్షణకు చర్యలు చేపట్టండి: కలెక్టర్

image

ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ నగరంలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అవసరం లేకుండా రోడ్లపైకి రావద్దన్నారు. బయటకు వచ్చే ముందు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వడదెబ్బ సూచనలు కనిపిస్తే సమీపములోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందాలన్నారు.

Similar News

News September 30, 2024

మచిలీపట్నంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు.

News September 30, 2024

రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించిన పోలీసులు

image

కృష్ణా జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించారని జిల్లా పోలీస్ యంత్రాంగం ఆదివారం తమ అధికారిక ట్విటర్(X) ఖాతాలో పోస్ట్ చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్న సమయంలో హెల్మెట్ ధరించకుండా, నిబంధనలు పాటించకుండా వాహనం నడుపుతున్నవారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారని తెలిపింది.

News September 30, 2024

కృష్ణా జిల్లా TODAY TOP NEWS

image

⁍ విజయవాడలో విషాదం.. పిల్లలతో కాలువలోకి దూకిన తల్లి
⁍ కృష్ణా: TDP MLC అభ్యర్థి ఖరారు?
⁍ చంద్రబాబుది నీచ రాజకీయం: వెల్లంపల్లి
⁍ తప్పు చేసుంటే అరెస్ట్ చేసుకోండి: పేర్ని నాని
⁍ రేపు విజయవాడకు రానున్న సినీ హీరో
⁍ కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్