News February 11, 2025

వనపర్తి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

కొత్తకోట మున్సిపాలిటీలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. దేవరకద్ర మండలం గుడిబండకి చెందిన విగ్నేశ్వర్ రెడ్డి(50) కొత్తకోటలోని అంబభవాని మాత ఉత్సవాలకు వచ్చారు. బైక్‌పై చౌరస్తాకు వెళ్తుండగా.. వనపర్తి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విగ్నేశ్వర్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

Similar News

News February 11, 2025

నితీశ్ అలసిపోయారు.. మానసికంగా రిటైరైపోయారు: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ CM నితీశ్ కుమార్‌పై జనసూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తాజాగా విమర్శలు గుప్పించారు. ‘ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విచిత్రం జరగనుంది. ఎన్డీయే గెలిచినా సరే నితీశ్ మాత్రం ఇక బిహార్ సీఎంగా కొనసాగరు. ఆయన పరిస్థితి బాలేదు. శారీరకంగా అలసి, మానసికంగా రిటైరైపోయారు. కనీసం తన మంత్రుల పేర్లు చెప్పే పరిస్థితిలో కూడా లేరు. బిహార్‌లో ఆయన ఇప్పుడు బీజేపీకి ఒక ముసుగు మాత్రమే’ అని పేర్కొన్నారు.

News February 11, 2025

బీచ్ ఫొటోలు ఎడిట్.. హీరోయిన్ ఆగ్రహం

image

ఒక నటిగా అందాన్ని ప్రదర్శించడంలో తాను జాగ్రత్తగా ఉంటానని మలయాళ నటి పార్వతీ R కృష్ణ చెప్పారు. అయితే ఇటీవల బీచ్ ఫొటో షూట్‌లో పాల్గొన్న దృశ్యాలను కొందరు యూట్యూబర్లు అసభ్యకరంగా ఎడిట్ చేసి పోస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇలాంటి తీవ్రమైన సమస్యపై ఇతరులు ఎందుకు స్పందించరో అర్థం కావట్లేదన్నారు. ఈమె ఏంజెల్స్, మాలిక్ తదితర చిత్రాల్లో నటించారు.

News February 11, 2025

తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, కళ్యాణకట్ట, వ్రతాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.18,59,854 ఆదాయం వచ్చిందన్నారు.

error: Content is protected !!