News April 8, 2025
వనపర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి: కలెక్టర్

వరికోతలు ప్రారంభమైన అన్ని గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సోమవారం కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రంలో తేమ, తూకం యంత్రాలు, టర్పాలిన్లు, గన్ని బ్యాగులు, ధాన్యం శుభ్రం చేసే మిషన్లు లేదా ఫ్యాన్లు కచ్చితంగా ఉండాలన్నారు.
Similar News
News April 18, 2025
ఖమ్మం జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

ఖమ్మం జిల్లాకు ఖమ్మం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా. ఖమ్మం నగర మధ్యలో ఉన్న స్తంభాద్రి నుంచి మండపాలకు, స్తంభాలకు కావాల్సిన రాళ్లు తరలించేవారని చరిత్ర చెబుతుంది. ఉర్దూ భాషలో ఖమ్మం అంటే స్తంభం అని అర్ధం. అలాగే నరసింహస్వామి పేరు మీద ఈ పేరు వచ్చిందనే వాదన ఉంది. బ్రిటిష్ వారి పాలనలో ఈ ప్రాంతాన్ని ‘ఖమ్మం మెట్టు’ అని పిలిచేవారనే మరో వాదన ఉంది. దీంతో ఖమ్మంకు అలా పేరు వచ్చిందని చెబుతున్నారు.
News April 18, 2025
భద్రాద్రి కొత్తగూడెంకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఊరును గూడెంగా పిలుస్తారు. కొత్తగా ఏర్పడిన గూడెం కొత్తగూడెంగా మారింది. కొత్తగూడెం సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం.. ఇక్కడ సింగరేణి హెడ్ ఆఫీస్ ఉండడం వల్ల దక్షిణ భారతదేశపు బొగ్గు పట్టణంగానూ పిలుస్తారు. అలాగే భద్రాచలం రామాలయం పేరు భద్రాద్రిగా మారింది. నూతనంగా ఏర్పడిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెంగా అవతరించింది.
News April 18, 2025
కీవ్లో భారత ఫార్మా గోడౌన్పై దాడి.. ఉక్రెయిన్కు రష్యా కౌంటర్

కీవ్లో APR 12న భారత ఫార్మా గోడౌన్పై దాడి జరగ్గా, దానికి కారణం రష్యా క్షిపణి అని ఉక్రెయిన్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా తాజాగా స్పందించింది.
ఉక్రెయిన్ క్షిపణుల వల్లే ఇది జరిగి ఉంటుందని కౌంటర్ ఇచ్చింది. ఆ దాడి తాము చేయలేదని భారత్లోని రష్యా ఎంబసీ స్పష్టం చేసింది. నివాస ప్రాంతాల్లో రాకెట్ లాంచర్లు, ఫిరంగులు సహా ఇతర సైనిక పరికరాలను మోహరించడం ఉక్రెయిన్కు పరిపాటిగా మారిందని మండిపడింది.