News March 21, 2025

వనపర్తిలో వ్యక్తికి జైలు శిక్ష 

image

ప్రజలు ఎవరూ కూడా మద్యం తాగి వాహనాలు నడపవద్దని వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి అన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వనపర్తికి చెందిన రమేశ్ నాయక్ అనే వ్యక్తిని గురువారం కోర్టులో హాజరు పరచగా.. అతడికి కోర్టు 6 రోజుల జైలు శిక్ష విధించామని తెలిపారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

Similar News

News March 22, 2025

TODAY TOP STORIES

image

* ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు
* చెన్నై చేరుకున్న రేవంత్, కేటీఆర్
* BRS వల్ల ఒక జనరేషన్‌ నాశనం: భట్టి
* సీఎంతో హరీశ్, పద్మారావు భేటీ
* పోసానికి బెయిల్ మంజూరు
* మంత్రి ఫరూక్ ఇంట తీవ్ర విషాదం
* తెలంగాణలో గాలి, వాన బీభత్సం
* ఆరోజు ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు: చిరు
* న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ స్టన్నింగ్ విన్

News March 22, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు రూ.6లక్షల పరిహారం: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బాధితులకు శుక్రవారం రూ.6లక్షల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్ ప్రమాదంలో చనిపోయిన మల్లిపాటి సూర్యనారాయణ, పైల సూరిబాబు, కొట్యాడ సూర్యప్రభ కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున రూ.6లక్షలు అకౌంట్‌లలో డిపాజిట్ చేసినట్లు సీపీ తెలిపారు. ఇప్పటి వరకూ 24 మంది బాధితులకు రూ.15 లక్షలు అందించామన్నారు.

News March 22, 2025

కూటమి ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకోవాల్సిందే: పేర్ని

image

AP: కూటమి ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకుని బతకాల్సిందేనని YCP నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రజలు వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ‘మా పార్టీ నేతల అరెస్టులతో జగన్ పరపతి ఏమీ తగ్గలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం మమ్మల్ని ఏమీ చేయలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే జగన్‌కే సాధ్యం. ఈ విషయంలో చంద్రబాబు, పవన్.. జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే’ అని ఆయన వ్యాఖ్యానించారు.

error: Content is protected !!