News April 4, 2025
వరంగల్: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు తండ్రి, కొడుకు

ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జరుగుతున్న 57వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు న్యాయ నిర్ణేతగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలానికి చెందిన కోట రాంబాబు ఎంపికయ్యాడు. ఆయన కుమారుడు సృజన్ ఖోఖో జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. దీంతో వారిని గ్రామస్థులు అభినందించారు.
Similar News
News April 8, 2025
సమ్మర్లో మీ ఫోన్ వేడెక్కుతోందా?

సమ్మర్లో ఎలక్ట్రానిక్ పరికరాలు వేగంగా వేడెక్కుతుంటాయి. వాటిలో మనం నిత్యం ఉపయోగించే మొబైల్ ఫోన్పై వేడిమి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫోన్పై సూర్యకాంతి నేరుగా పడకుండా చూసుకోవాలి. యాప్స్ను ఎక్కువగా వాడకుండా ఉండాలి. వేడెక్కినట్లు అనిపిస్తే వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేసేయాలి. వేడెక్కినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీజర్లో ఉంచకూడదు. కారులో ఫోన్ పెట్టి వదిలేయకండి
News April 8, 2025
IPL: పోరాడి ఓడిన ముంబై

వాంఖడేలో ఆర్సీబీతో జరిగిన మ్యాచులో ముంబై పోరాడి ఓడింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ(29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్య(15 బంతుల్లో 42) వీరోచిత పోరాటం వృథా అయింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ 4 వికెట్లు, దయాల్, హేజిల్వుడ్ చెరో 2, భువీ ఒక వికెట్ తీశారు.
News April 8, 2025
వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెండు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. చర్లపల్లి నుంచి తిరుపతికి శుక్ర, ఆదివారాల్లో రా.9.35కు ట్రైన్ బయలు దేరనుండగా.. శని, సోమ వారాల్లో సా.4.35కు తిరుపతి నుంచి చర్లపల్లికి రైలు వెళ్లనుంది. ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.