News March 10, 2025

వరంగల్ జిల్లాలో ప్రమాదకరంగా SRSP

image

తీగరాజుపల్లి వద్ద గల SRSP కాలువలో పడి మేచరాజుపల్లికి చెందిన ముగ్గురు శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఘటన జరగడం రెండోసారి కావడంతో జిల్లా ప్రజలు భయపడుతున్నారు. జిల్లాలోని అక్కడక్కడ SRSP కాలువ పక్కన గల రహదారులు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రయాణికులు,స్థానికులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నామని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Similar News

News March 10, 2025

చట్ట పరిధిలో సమస్యల పరిష్కరించాలి: ఎస్పీ

image

పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను చట్టపరిధిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డుడి చెప్పారు. సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 89 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఎస్పీ నేరుగా అర్జీలను స్వీకరించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

News March 10, 2025

NZB: సీపీగా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య

image

నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా సాయి చైతన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ను ఇటీవల నిజామాబాద్‌కు బదిలీ చేశారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో సీపీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన కల్మేశ్వర్ హైదరాబాద్‌కు బదిలీ కాగా, కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐదు నెలల అనంతరం జిల్లాకు నూతన పోలీస్ బాస్ వచ్చారు.

News March 10, 2025

పేదల జీవన ప్రమాణాలు మెరుగు కోసం పీ4 సర్వే: జేసీ

image

పేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి పి4 సర్వే ఎంతగానో దోహదపడుతుందని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. బాపట్ల కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం (P4)తో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి అనే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తుందన్నారు.

error: Content is protected !!