News March 24, 2025
వరంగల్: నగర అభివృద్ధికి సహకరించండి: కమిషనర్

పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని GWMC కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే నగర ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరపు పన్నులు చెల్లించడానికి కేవలం 8రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, దీర్ఘకాలంగా పన్నులు చెల్లించని వారికి ఇప్పటికే రెడ్ నోటీసులు అందించి ఆస్తులను జప్తు చేస్తున్నామని హెచ్చరించారు.
Similar News
News March 26, 2025
కునాల్ కమ్రాకు ప్రకాశ్ రాజ్ మద్దతు

కమెడియన్ కునాల్ కమ్రాకు నటుడు ప్రకాశ్ రాజ్ తన మద్దతును ప్రకటించారు. ‘లగే రహో డియర్ కునాల్. మనం ఈ సమస్యను కలిసి అధిగమిద్దాం. నీకు మరింత శక్తి లభించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిండేపై వివాదాస్పద <<15877588>>వ్యాఖ్యలు<<>> చేయడంతో కమ్రా చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే.
News March 26, 2025
రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం

హైదరాబాద్కి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల <<15882715>>మృతదేహానికి <<>>పోస్టుమార్టం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ బందోబస్తు నడుమ బుధవారం నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులు సమక్షంలో వీడియో పర్యవేక్షణలో వైద్యులు పోస్టుమార్టం చేస్తున్నారు. ఇప్పటికే అధిక సంఖ్యలో క్రైస్తవ పెద్దలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేశారు.
News March 26, 2025
నేడు విజయవాడకు వైఎస్ జగన్ షెడ్యూల్ ఇదే.!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గురునానక్ కాలనీలోని NAC కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అనంతరం జగన్ వైసీపీ ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు దేవినేని అవినాశ్ తెలిపారు.