News August 21, 2024
వరంగల్: పత్తి క్వింటా రూ.7,500
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులుగా పత్తి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,370 ఉండగా.. నేడు రూ.130 పెరిగి రూ.7,500 పలికింది. రెండు నెలల వ్యవధిలో ఇంత ధర రావడం ఇదే మొదటిసారి. రెండు రోజులుగా పత్తి ధరలు పెరుగుతుండడం అన్నదాతలకు కొంత ఉపశమనం కలిగించే విషయం.
Similar News
News September 30, 2024
వరంగల్: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!
DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
HNK 830 72 1:11
JN 582 117 1:05
BHPL 716 151 1:05
MHBD 2072 263 1:08
MLG 881 125 1:07
WGL 1074 169 1:06
News September 29, 2024
పాలకుర్తి: ఇళ్లు ఖాళీ చేయించడం దారుణం!
పాలకుర్తి మండలంలోని తొర్రూరు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేయించడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాధితులతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడానికి స్థలం లేకపోవడంతో తన సొంత ఖర్చులతో 20 గ్రామాల్లో భూమి కొనుగోలు చేసి నిరేపేదలకు అందించామన్నారు.
News September 29, 2024
సంతాపం ప్రకటించిన ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు
రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి మరణం పట్ల ఉమ్మడి జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సంతాపం వ్యక్తం చేశారు. ఒక గొప్ప రాజకీయ నాయకునిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీర్చిదిద్దిన వారు ధన్యులని మంత్రులు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని మంత్రులు చెప్పారు.