News March 27, 2025
వరంగల్: మరమ్మత్తుల కారణంగా చర్లపల్లి వరకే కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు

కృష్ణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్లడం లేదని రైల్వే జీయం అరుణ్ కుమార్ జైన్ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి స్టేషన్ను అభివృద్ధి చేయడంతో పాటు, కొన్ని మరమ్మత్తుల కారణంగా కృష్ణ ఎక్స్ప్రెస్ను చర్లపల్లి వరకే పరిమితం చేశామని, సికింద్రాబాద్కు పోవు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు గమనించి, సహకరించాల్సిందిగా వారు కోరారు.
Similar News
News December 14, 2025
మంచిర్యాల జిల్లాలో 56.44% పోలింగ్

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న 2వ విడత పోలింగ్ 56.44% జరిగినట్లు అధికారులు తెలిపారు. బెల్లంపల్లిలో 63.5%, భీమిని 67.5%, కన్నెపల్లి 62.56, కాసిపేట 51.49%, నెన్నెల 55.56%, తాండూర్ 48.58%, వేమనపల్లిలో 57.07% పోలింగ్ నమోదయింది. .
News December 14, 2025
వనపర్తి జిల్లాలో పోలింగ్ శాతం @11AM

రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లాలోని ఐదు మండలాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా అధికారులు మండలాల వారిగా ఉదయం 11 గంటల వరకు పోలింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 59.7% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా. వనపర్తి 56.4%, కొత్తకోట 60.4%, మదనాపూర్ 60.9%, ఆత్మకూరు 57.8%, అమరచింత 67.0% పోలింగ్ నమోదైంది.
News December 14, 2025
అనకాపల్లిలో ఈనెల 17న మెగా జాబ్ మేళా

అనకాపల్లి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన అనకాపల్లి ఆదినారాయణ మహిళా కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా అధికారి గోవిందరావు తెలిపారు. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పాలిటెక్నిక్, పీజీ చేసి 18-40 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి గలవారు naipunyam.ap.gov.in వెబ్ సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. 52 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు.


