News April 4, 2025
వరంగల్: మాయదారి వానలు.. అప్పులే గతి!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.
Similar News
News April 7, 2025
ప్రభుత్వానికి సలహా మండలి: సీఎం చంద్రబాబు

AP: ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం సలహా మండలిని నియమించనున్నట్లు RTGSపై సమీక్షలో CM చంద్రబాబు ప్రకటించారు. సభ్యులుగా గేట్స్ ఫౌండేషన్, IIT సహా వివిధ రంగాలకు చెందిన 10 మంది నిపుణులు ఉండనున్నారు. ప్రజలకు మరింత మేలు చేసేలా, సుపరిపాలన అందించేలా ఇంకా ఏమి చేయవచ్చనే దానిపై ఈ మండలి అధ్యయనం చేసి సూచనలు ఇవ్వనుందని వివరించారు. కాగా జూన్12 కల్లా వాట్సాప్లోకి అన్ని సేవలను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
News April 7, 2025
28 ఏళ్లుగా నో యాక్టింగ్..అయినా రిచ్చెస్ట్ పర్సన్

వ్యాపార వేత్తగా సక్సెస్ సాధించిన మెకాలే కుల్కిన్ మూడేళ్ల వయసులోనే టీవీషోలలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. 1992లో వచ్చిన మైటీ డక్స్ మూవీతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1997లోనే నటనకు వీడ్కోలు పలికి వ్యాపారం ప్రారంభించారు. ఇంటర్నెట్ గేమింగ్ ఎంటర్టైన్మెంట్ స్థాపించి సక్సెస్ సాధించారు. నటనకు వీడ్కోలు పలికినప్పటికీ సినిమా ఫీల్డ్లో మెకాలేనే రిచ్చెస్ట్ యాక్టర్గా భావిస్తారు.
News April 7, 2025
ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రజల నుంచి 75 దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.