News March 21, 2025

వరంగల్ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన రైల్వే జనరల్ మేనేజర్

image

వరంగల్ రైల్వే స్టేషన్‌ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, స్టేషన్ పరిసర ప్రాంగణాన్ని సమీక్షించారు. ఏబీఎస్ఎస్‌లో భాగంగా రూ.25.89 కోట్ల వ్యయంతో స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పుడు అనుసరిస్తున్న భద్రత విధానాలను మార్గదర్శకాలను పరిశీలించారు.

Similar News

News March 22, 2025

ప్రారంభమైన కాజీపేట-విజయవాడ (MEMU) ట్రైన్

image

కాజీపేట నుంచి డోర్నకల్, ఖమ్మం మీదుగా విజయవాడ వరకు వెళ్లే (MEMU) ట్రైన్ నంబర్ 67269) ఈరోజు నుంచి ప్రారంభమైంది. ట్రైన్ ఉ.6:40 ని.లకు బయలుదేరి మధ్యాహ్నం 12: 00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మూడో లైన్ పనులు, కారణాల వల్ల కొంతకాలంగా ఈ ట్రైన్ నిలిపివేశారు. పనులు పూర్తి కావడంతో ఈ రైలును మళ్లీ పునరుద్ధరించారు.

News March 22, 2025

బెట్టింగ్ రాయుళ్లపై నజర్ పెట్టండి: వరంగల్ సీపీ

image

నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమవుతున్న వేళ క్రికెట్ బెట్టింగ్‌లకు అవకాశం ఉండటంతో WGL CP సన్ ప్రీత్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో బెట్టింగ్ రాయుళ్లపై నిఘా పెట్టాలని, యువత బెట్టింగ్‌పై ఆసక్తి చూపకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గతంలో బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై నిఘా పెట్టాలని, ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News March 22, 2025

వరంగల్ జిల్లాలో తగ్గుతున్న భూగర్భ జలాలు

image

వరంగల్ జిల్లాలో వేసవి దృష్ట్యా భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. గతేడాది ఫిబ్రవరి కంటే ఈ ఏడాది మరింత లోతుకు పడిపోయాయి. జిల్లాలో దుగ్గొండి, ఖానాపురం, ఖిలా వరంగల్ మినహా మిగతా 10 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపు చేసుకునేందుకు ఇళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలను తవ్వడం, నీటి వృథాను అరికట్టడం వంటి చర్యలు ఉత్తమ మార్గం.

error: Content is protected !!