News March 10, 2025
వరంగల్: సింగల్ పట్టి మిర్చి రూ. 39వేలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి సోమవారం అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.17వేలు పలకగా,1048 రకం మిర్చి రూ.11వేలు, 5531 రకం మిర్చికి రూ. 11,300 ధర వచ్చింది. అలాగే ఎల్లో మిర్చికి రూ.20 వేలు, టమాటా మిర్చికి రూ.28వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.39వేల ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
Similar News
News March 10, 2025
నర్సంపేట: అన్ని తామై.. అనాథ యువతుల పెళ్లిళ్లకు ఏర్పాట్లు

నర్సంపేటలోని సంజీవని అనాథాశ్రమంలో చిన్నప్పటి నుంచి ఆశ్రయం పొందిన రోజా, నాగరాణి అనే ఇద్దరు అనాథ యువతులకు ఈనెల 12న వివాహాలు జరగనున్నాయి. ఆ పెళ్లితంతులో భాగంగా సోమవారం అదే ఆశ్రమంలో ఇద్దరు యువతులకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళల నడుమ మంగళస్నానాలు చేయించారు. ఏ లోటు లేకుండా పెళ్లిళ్లు జరపాలనే సేవాగుణాన్ని చాటుకోవడం పట్ల ఆశ్రమ నిర్వాహకుడు డా.మోహనరావును ఐసీడీఎస్ సీడీపీవో మధురిమ అభినందించారు.
News March 10, 2025
WGL: ప్రభుత్వ రాయతీని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సదుపాయాలని లేఅవుట్, నాన్ లేఅవుట్ ఫ్లాట్లు, యజమానులు డెవలపర్లు ఫ్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ తెలిపారు. కూడా కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులతో ఎల్ఆర్ఎస్పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు రెగ్యులరైజ్ చేసుకోవాలన్నారు. నిబంధనల మేరకు అనుమతులు ఇస్తామన్నారు.
News March 10, 2025
WGL: ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ

వరంగల్ జిల్లాలోని పలు చోట్ల నేడు పొగమంచు కమ్ముకుంది. ఈ క్రమంలోనే నెక్కొండ మండలంలో ఈరోజు తెల్లవారుజామున పొలం పనులకు, స్కూళ్లకు, అవసరాల నిమిత్తం బయటికి వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. అలాగే మధ్యాహ్నం సమయంలో భానుడు సైతం తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని, ఎండ దంచి కొడుతుందని ప్రజలు తెలుపుతున్నారు. మండలంలో విచిత్ర వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు.