News March 16, 2025

వరంగల్‌లో కిలాడి లేడీ అరాచకాలు

image

వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. పాఠశాలకు వెళ్లే బాలికలను టార్గెట్ చేసి వారిని కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత వారిపై అత్యాచారాలు చేయించి, స్పృహలో రాగానే ఎక్కడ కిడ్నాప్ చేశారో.. అక్కడ వదిలి వెళ్తున్నారు. ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ విషయం బయటపడింది. ఆ కిలాడీకి మరో నలుగురు యువకులు సహాయపడుతున్నట్లు తెలుస్తోంది. వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Similar News

News March 16, 2025

అల్లూరి: కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు: కలెక్టర్

image

10th తరగతి పరీక్షలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో అల్లూరి కలెక్టర్ దినేశ్ కుమార్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని వీసీలో హెచ్చరించారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీ లేకుండా చూడాలని, ఉత్తీర్ణత పెంచాలని కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. జిల్లాలో 11,762 మంది 71 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. వీటిలో 20 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

News March 16, 2025

టీ పాలెం: పురుగుమందు కలిపిన నీళ్లు తాగి వ్యక్తి మృతి

image

పురుగుమందు కలిసిన మంచినీళ్లు తాగి రైతు మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలం సోలిపురం పిక్యాతండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బీ.రామోజీ అనే వ్యక్తి కాకరవాయిలో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. తన పొలం పక్క రైతు రవి పాత కక్షల నేపథ్యంలో తన వెంట తెచ్చుకున్న నీళ్లలో పురుగుమందు కలిపాడు. ఆ నీటిని తాగి రామోజీ అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 16, 2025

సమయానికి చేరుకునేలా ఉచిత బస్సులు: మంత్రి రాంప్రసాద్

image

AP: టెన్త్ విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకొని, జయప్రదంగా పరీక్షలు రాయాలన్నారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. రేపటి నుంచి 6.15లక్షల మంది టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు.

error: Content is protected !!