News July 20, 2024

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

image

అధిక వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు, రైతులు, వాహనదారులు ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వరద ప్రవాహాల వద్దకు సెల్ఫీ కోసం వెళ్లి ప్రమాదాలకు బారిన పడవద్దని, అత్యవసర సమయంలో 100కు ఫోన్ చేసి సాయం పొందాలని, శిథిలావస్థకు వచ్చిన నివాసాల్లో ఉండవద్దని, చేపల వేటకు వెళ్లొద్దని, చెరువులు, వాగులు వద్దకు వెళ్లకూడదన్నారు.

Similar News

News October 1, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముఖ్య సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ప్లో 49,651 క్యూసెక్కులు కొనసాగుతుంది. జల విద్యుత్ కేంద్రానికి 28,435, కుడి కాల్వకు 10,425, ఎడమ కాల్వకు 6,781, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాల్వకు 800 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

News October 1, 2024

నల్లగొండ: బతుకమ్మ, దసరా సందర్భంగా 639 అదనపు బస్సులు

image

బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని నల్లగొండ రీజియన్ లోని 7 డిపోల నుండి సుమారు 639 బస్సులను అదనంగా నడుపుతున్నామని ఆర్ఎం M. రాజశేఖర్ సోమవారం తెలిపారు. అక్టోబర్ 1 నుండి 11 వరకు, తిరుగు ప్రయాణం కోసం 13 నుండి 17 వరకు బస్సులు నడుపుతామని తెలిపారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా సురక్షితమైన, సౌకర్యవంతమైన, శుభప్రదమైన ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని కోరారు.

News October 1, 2024

NLG: లా పరీక్షలు వాయిదా

image

న్యాయశాస్త్రం 3, 5 సంవత్సరాల కోర్సు రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను వాయి దా వేస్తున్నట్లు నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరీక్షల కన్వీనర్ ఉపేందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. .