News February 24, 2025
వల్లభనేని వంశీ కేసులో కీలక అప్డేట్

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో కోర్టు కీలక తీర్పునిచ్చింది. వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం మూడు రోజులు కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించాలని సూచించింది. అలాగే వంశీకి వెస్ట్రన్ టాయిలెట్స్, మంచం సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News February 24, 2025
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

పది, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహనపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం బోర్డు పరీక్షల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
News February 24, 2025
కడప జిల్లా TODAY TOP NEWS

➢ రేపు పులివెందులకు రానున్న జగన్
➢ మార్చి 1న కడపకు వస్తున్న హీరోయిన్ మెహరీన్
➢ కమలాపురం: కష్టాల కడలిలో కుల వృత్తులు
➢ YVU నూతన వైస్ ఛాన్స్లర్గా ప్రకాశ్ బాబు బాధ్యతలు
➢ జగన్ అసెంబ్లీకి వెళ్తే వారికి సినిమా: కడప ఎంపీ
➢ లింగాల మండలంలో దారుణ హత్య
➢ జగన్ సంతకం పెట్టడానికే అసెంబ్లీకి వెళ్లారు: బీటెక్ రవి
➢ మార్చి 1 నుంచి జమ్మలమడుగులో ప్లాస్టిక్ నిషేధం
➢ శివరాత్రికి పొలతలలో ఏర్పాట్లు పూర్తి
News February 24, 2025
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ ప్లేయర్

WPLలో ఆర్సీబీ ప్లేయర్ ఎలీస్ పెర్రీ చరిత్ర సృష్టించారు. టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఆమె అవతరించారు. ఇప్పటివరకు పెర్రీ 835 పరుగులు సాధించారు. ఈ క్రమంలో మెగ్ లానింగ్(782) రికార్డును ఆమె తుడిచిపెట్టేశారు. యూపీతో జరుగుతున్న మ్యాచులో ఆమె ఈ ఫీట్ నెలకొల్పారు. కాగా ఐపీఎల్లోనూ అత్యధిక పరుగుల రికార్డు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (8,004) పేరిట ఉన్న విషయం తెలిసిందే.