News March 29, 2025
వికారాబాద్: అగ్నివీర్కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని మదనంతాపూర్ గ్రామానికి చెందిన అరవింద్, మంబాపూర్ గ్రామానికి చెందిన అరుణ్ కుమారులు అగ్నివీర్ కు ఎంపికయ్యారు. మండలం నుంచి ఈ ఏడాది ఇద్దరు ఎంపిక కావడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరువురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే కావడం గమనార్హం.
Similar News
News April 2, 2025
పెద్దాపురం: కాండ్రకోట నూకాలమ్మ జాతరలో విషాదం

పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ జాతరలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఇద్దరు ఏలేరు కాలువలోకి స్థాన్నానికి దిగి గల్లంతు అయ్యారు. స్థానికులు వివరాలు.. కాకినాడ, జగన్నాధపురం బిర్యానీ పేటకు చెందిన పిరమాడి విశాల్ (7), కొప్పాడి బాలు (22) ఇద్దరి గల్లంతవ్వగా బాలుడు మృతదేహం బుధవారం లభ్యమైంది. మరో మృతదేహం కోసం పెద్దాపురం ఎస్సై వి.మౌనిక ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు.
News April 2, 2025
‘తల్లికి వందనం’ వారికే ఇవ్వాలని చెప్తే CM ఒప్పుకోలేదు: జ్యోతుల నెహ్రూ

AP: ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకే ‘తల్లికి వందనం’ అమలు చేయాలని CM చంద్రబాబుకు చెబితే ఆయన ఒప్పుకోలేదని MLA జ్యోతుల నెహ్రూ తెలిపారు. దీంతో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరుగుతాయని చెప్పినా వినలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ పథకం వర్తింపజేస్తామని సీఎం చెప్పినట్లు వివరించారు. కాగా, జూన్ 12లోపు ‘తల్లికి వందనం’ అమలు చేస్తామని నిన్న మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన విషయం తెలిసిందే.
News April 2, 2025
ట్రంప్ టారిఫ్స్ ప్రకటనపై ఉత్కంఠ.. ఎప్పుడంటే?

US ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ అర్ధరాత్రి 1.30గం.లకు(భారత కాలమానం ప్రకారం) దిగుమతులపై టారిఫ్స్ ప్రకటించనున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. టారిఫ్స్ పెరిగితే అమెరికన్ కంపెనీలు ఆ భారాన్ని ఎగుమతిదారులపై వేస్తాయి. ఫలితంగా ఆయా దేశాల్లో ఆర్థిక మాంద్యం నెలకొనే ప్రమాదం ఉంది. ఇప్పటికే వైట్హౌజ్ మీడియా సెక్రటరీ కరోలిన్ భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.